70 ఎకరాల మొక్కజొన్న దగ్ధం | Sakshi
Sakshi News home page

70 ఎకరాల మొక్కజొన్న దగ్ధం

Published Wed, Apr 8 2015 5:50 PM

70 Acres corn crop burn in prakasam distirict

ఒంగోలు : ప్రకాశం జిల్లా గవిలవారిపాళెం గ్రామంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో 70 ఎకరాల్లో మొక్కజొన్నపంట దగ్ధమైంది. దాదాపు కోటి రూపాయల వరకు ఆస్థినష్టం ఉంటుందని భావిస్తున్నారు. పరిసర పొలాల్లో క్రిమికీటకాల నివారణకు వేసిన మంటల వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధిత రైతులు చెబుతున్నారు. రెవెన్యూ అధికారులు సంఘటనస్థలానికి వెళ్లి పంట నష్టం వివరాలు సేకరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement