టెక్కలి రూరల్, న్యూస్లైన్: పై-లీన్ తుపాను ప్రభావాన్ని జిల్లాలో సమర్ధంగా ఎదుర్కొన్నామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి చెప్పారు. టెక్కలిలో కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆస్తి నష్టాలను పక్కన పెడితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని వెల్లడించారు. తుపాను ప్రభావిత తీర గ్రామాలకు చెందిన సుమారు 74 వేల మత్స్యకార కుటుంబాలను నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. తుపాన్ నష్టాలను పారదర్శకంగా అంచనా వేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజనపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ 2014 ఎన్నికల వరకు రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందన్నారు. శాసనసభలో తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తామన్నారు. సమావేశంలో కేంద్ర మంత్రి కృపారాణి, రాష్ట్ర మంత్రులు బాలరా జు, గంటా శ్రీనివాస్ పాల్గొన్నారు.
నష్టపరిహారం అందిస్తాం..
సోంపేట(కంచిలి): తుపాను వల్ల నష్టపోయినవారికి పరిహారం అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి నేతృత్వంలోని మంత్రుల బృందం హామీ ఇచ్చింది. తుపాను బాధిత గ్రామాలైన బారువ కొత్తూరు, వాడపాలెం, కవిటి తదితర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం మంత్రుల బృందం పర్యటించింది. బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంది. బోట్లు, వలలు సముద్రంలో కొట్టుకుపోవటం, చిరిగిపోవటంతో ఒక్కో కుటుంబానికి లక్షలాది రూపాయల్లో నష్టం వాటిల్లిందని బాధిత మత్స్యకారులు వాపోయారు. కంటి తుడుపు చర్యగా వచ్చి పరామర్శించి వెళ్లిపోవటం సరికాదని కొందరు మహిళలు మంత్రుల్ని నిలదీశారు. ప్రభుత్వ స్పందన బాగోలేదని ఆరోపించారు. ఈ సందర్భంగా మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఇంతటి నష్టం జరగటం బాధాకరమేనని, తొందర్లో సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో కేంద్రమంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి, రాష్ట్ర మంత్రులు శత్రుచర్ల విజయరామరాజు, కోండ్రు మురళీమోహన్, గంటా శ్రీనివాస్, బాలరాజు పాల్గొన్నారు. వీరితోపాటు వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్, కాంగ్రెస్ నేత డాక్టర్ ఎన్.దాస్ తదితరులు పాల్గొన్నారు.
74 వేల మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరుకులు
Published Mon, Oct 14 2013 3:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement