9 మంది సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్‌ | Sakshi
Sakshi News home page

9 మంది సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్‌

Published Mon, Sep 2 2013 11:55 AM

9 Seemandhra MPs suspended from Lok sabha

న్యూఢిల్లీ : లోక్సభలో తొమ్మిదిమంది సీమాంధ్ర ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. కాంగ్రెస్, టీడీపీ ఎంపీలను స్పీకర్ మీరాకుమార్ అయిదు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్నారంటూ 347A నిబంధన కింద విచక్షణ అధికారంతో వారిపై  స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. సస్పండ్ అయినవారిలో ఎంపీలు సాయి ప్రతాప్, అనంత వెంకట్రామిరెడ్డి, మాగంట శ్రీనివాసులరెడ్డి,లగడపాటి రాజగోపాల్, కనుమూరి బాపిరాజు, కొనకళ్ల నారాయణ, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్ ఉన్నారు.

Advertisement
Advertisement