అనంతపురం అగ్రికల్చర్ : వాతావరణ బీమా ప్రీమియం చెల్లింపు గడువు పొడిగించకపోవడంతో జిల్లాలో దాదాపు 90 వేల మంది రైతులకు అన్యాయం జరుగుతోంది. మునుపెన్నడూ లేని విధంగా ప్రీమియం చెల్లింపు గడువు ఈ సారి ముందుగానే ముగిసింది. గతంలో చాలాసార్లు ఆగస్టు ఆఖరు వరకు గడువిచ్చారు. ఈసారి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ బీమా కంపెనీ మొదట జూన్ 30, ఆ తరువాత జులై 9, మరోసారి జులై 31 వరకు గడువు ఇచ్చాయి. మరోసారి గడువు పొడిగిస్తారని రైతులు ఆశించారు. రైతులు, రైతు సంఘాలు, విపక్షాలు గగ్గోలు పెడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచడం లేదు.
దీనివల్ల వేరుశనగ రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత ఖరీఫ్లో పంట రుణాల రెన్యూవల్, కొత్త రుణాల కింద 6.20 లక్షల మందికి రూ.3,056 కోట్లు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. వాతావరణ బీమా ప్రీమియం చెల్లింపు గడువు ముగిసిన జులె 31 నాటికి 5.22 లక్షల మంది రూ.2,648 కోట్లు రెన్యూవల్ చేసుకున్నారు. వీరందరికీ బీమా వర్తించనుంది. ఇంకా 90 వేల మందికి అన్యాయం జరుగుతోంది. రూ.408 కోట్లు రెన్యూవల్ కావాల్సివుంది. జిల్లా వ్యాప్తంగా 33 ప్రిన్సిపల్ బ్యాంకుల కింద సుమారు 400 శాఖలు పనిచేస్తున్నాయి.
రెన్యూవల్కు రైతులు ఎగబడుతున్నా బ్యాంకుల్లో సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యల వల్ల ఆశించిన స్థాయిలో వేగవంతం కాలేదు. దీనివల్ల రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఎన్ని హెక్టార్లకు ఎన్ని కోట్ల ప్రీమియం చెల్లించారనే లెక్కలు అన్ని బ్యాంకు శాఖల నుంచి అందాల్సివుంది. ఈ సారి అగ్రికల్చర్ గోల్డ్ లోన్ల కింద 68,024 మందికి రూ.438.05 కోట్లు ఇచ్చినట్లు లీడ్బ్యాంకు జిల్లా మేనేజర్ (ఎల్డీఎం) జయశంకర్ తెలిపారు. బీమా గడువు పొడిగింపునకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులూ రాలేదన్నారు.
90 వేల మందికి అన్యాయం
Published Wed, Aug 5 2015 3:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్కప్కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement