చాపాడు, న్యూస్లైన్: మురుగు కాలువలో పూడిక తీస్తూ అందులో ఇరుక్కుపోయి లక్షుమయ్య(27) అనే పారిశుద్ధ్య కార్మికుడు మృత్యువాతపడ్డాడు. మైదుకూరు మున్సిపాలిటిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసే లక్షుమయ్య రోజులాగే సోమవారం కూడా విధుల్లో భాగంగా సాయిబాబా క్లాత్ మార్కెట్ వద్ద గల డ్రైనేజీలో పూడిక తొలగించడానికి సిద్ధమయ్యాడు. పూడిక తీస్తూ అందులో చిక్కుకుపోయాడు. బయట పడలేక, ఊపిరాడక డ్రేనేజీలోనే మృతి చెందాడు.
ఓ వైపు సమైక్యాంధ్ర ఉద్యమంలో మైదుకూరు ప్రజానీకం ఉండగా, మరో వైపు లక్షుమయ్య మరణం పట్టణంలో దిగ్బ్రాంతిని కలిగించింది. వివరాలు ఇలా ఉన్నాయి..
మైదుకూరు పట్టణ పరిధిలోని భూమాయపల్లెకు చెందిన చెరుకూరి లక్షుమయ్య ఏడాదినర్రగా అరుంధతీనగర్లో నివాసం ఉంటూ, పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే సోమవారం కూడా విధుల్లోకి తోటి కార్మికులతో కలిసి వచ్చారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సాయిబాబా క్లాత్ మార్కెట్ వద్ద డ్రైనేజీ కాలువలో పనులు చేస్తున్నారు. కాలువలో ఒక పక్కన రెండు బండలను తొలగించి లోపల ఉండే పూడికను తొలగించేందుకు మరింత లోపలికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలువ లోపల చిక్కుకున్నాడు. ఎంతసేపైనా రాకపోవడంతో తోటి కార్మికులకు అనుమానం వచ్చి పిలిచారు. అయినా అతను పలుకలేదు. దీంతో వారు లోపలికి వెళ్లి చూశారు. అప్పటికే మురుగునీటిలో మునిగిపోయి ఉన్న లక్షుమయ్యను పట్టుకుని బయటికి తీసేందుకు ప్రయత్నించగా రాకపోవటంతో ఇరుక్కుపోయిన్నట్లు గుర్తించారు.
అప్పటికే విషయం తెలుసుకున్న కమిషనర్ మల్లయ్యనాయుడు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీని తెప్పించి కాలువను పగులగొట్టగా లక్షుమయ్య చనిపోయి కన్పించాడు. ఈ విషయం తెలిసి మైదుకూరు ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చారు. లక్షుమయ్య శవాన్ని తోటి కార్మికులు, బంధువులు సమైక్యాంధ్ర ఉద్యమం వద్దకు తీసుకువచ్చి న్యాయం చేయాలని కోరారు. పోలీసులు జోక్యం చేసుకుని మున్సిపల్ కమిషనర్తో చర్చలు జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. మృతుని కుటుంబానికి ఆర్థికసాయం, మూడు సెంట్ల స్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని మున్సిపల్ కమిషనర్ చెప్పారు.
ఊపిరి తీసిన డ్రైనేజీ
Published Tue, Sep 3 2013 5:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement