మైనరు బాలికను బంధించి అత్యాచారం
ప్రశాంత విశాఖ ఉలికిపడింది. వరుస అత్యాచార సంఘటనలతో కలవరపడింది. నెలరోజుల క్రితం హైదరాబాద్కు చెందిన ఓ యువతిని అత్యాచారం చేసిన సంఘటన మాసిపోకమునుపే మరో వైనం చోటుచేసుకుంది. ముగ్గురు మృగాళ్ల కిరాతకం శనివారం బయటపడింది.
డాబాగార్డెన్స్: ముగ్గురు కిరాతకులు విశాఖలో ఓ మైనరు బాలికను దారుణంగా బంధించి అత్యాచారం చేశారు. మూడు రోజులపాటు కాళ్లు చేతులూ కట్టేసి గదిలో బంధించి అమానవీయంగా వ్యవహరించారు. నగరంలో శనివారం ఈ సంఘటన సంచలనం రేకెత్తించింది. డీసీపీ త్రివిక్రమ వర్మ కథనం ప్రకారం వివరాలివి. హైదరాబాద్కు చెందిన 14ఏళ్ల బాలిక తునిలో తాతగారింట్లో ఉంటోంది. పదిరోజుల క్రితం అలిగి బయటకొచ్చేసింది. తిరుపతి రెలైక్కేసింది. అక్కడ తనకు తెలిసిన స్నేహితునితో కలిసి ఐదురోజుల తర్వాత తుని తాతగారింటికి బయలు దేరింది. తీరా తుని చేరుకున్నాక ఇంటికి వెళ్లాలంటే బాలిక మనసంగీకరించలేదు. దీంతో తుని రైల్వే స్టేషన్లోనే తచ్చాడింది. ఇదే అదనుగా ఇద్దరు వ్యక్తులు ఆమె దగ్గరకు చేరారు. తాము ఇంటికి తీసుకు వెళ్తామంటూ నమ్మించారు.
వారి మాటలను విశ్వసించిన బాలిక వారి ద్విచక్ర వాహనం ఎక్కింది. వారు మాయమాటలతో విశాఖ తీసుకువచ్చారు. తాడివీధిలో ఓ ఇంటికి తీసుకు వెళ్లారు. అక్కడ గదిలో తాళ్లతో బంధించారు. వారికి మరో వ్యక్తి తోడయ్యాడు. ముగ్గురూ బాలికపై అమానవీయంగా అత్యాచారం చేశారు. ఆమె అరుపులు వినిపించకుండా టీవీ సౌండ్ పెంచేవారు. మూడు రోజుల తర్వాత బాధితురాలిని అమానుషంగా గదిలో ఉంచి తాళం వేసి వెళ్లిపోయారు. శనివారం ఉదయం ఆమె కేకలకు ఇరుగుపొరుగు వారు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి బాధితురాలికి విముక్తి కలిగించారు. ఈ కేసులో ఫోన్ ఆధారంగా ప్రధాన నిందితుడు వీరబాబును వెంటనే పోలీసులు అరెస్టు చేయగలిగారు. మిగిలిన నిందితుల్ని కూడా పట్టుకుని తీరతామని డీసీపీ త్రివిక్రమవర్మ విలేకరులకు చెప్పారు.
వరుస ఘటనలతో బెంబేలు..
మార్చి 16న ఆనందపురం మండలం వేములవలసకు చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న 14గేళ్ల బాలికపై పక్క ఇంట్లో ఉంటున్న పట్నాల ప్రసాద్ నేరుగా ఇంట్లోకి ప్రవేశించి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారానికి యత్నించాడు. దీంతో భీతిల్లిన ఆ బాలిక కేకలు వేయడంతో పరిసర ప్రాంతాల వారు పరుగున రావడంతో నిందితుడు ప్రసాద్ పారిపోయాడు.
మార్చి 12న గృహిణిని వేధించిన వ్యక్తిని ఆరిలోవ పోలీసులు అరెస్టు చేశారు. ఆరిలోవలో భర్తతో నివాసముంటున్న ఓ మహిళ కొద్ది రోజుల కిందట ఆమె విజయనగరం జిల్లా సాలూరులోని పుట్టింటికి వెళ్లింది. అక్కడ భాస్కర్ అనే టైలర్కు జాకెట్టు కుట్టమని ఇచ్చింది. కుట్టిన జాకెట్టు ఇచ్చినప్పుడు ఆమె ఫోన్ నెంబరు తీసుకొని అప్పటి నుంచి ఫోన్ చేసి వేధించడంతో ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ అనంతరం భాస్కర్ను అరెస్టు చేశారు.
గత నెల 24న కోటవీధికి చెందిన 15ఏళ్ల బాలికపై తెలుగుదేశం పార్టీ నాయకుడు మహ్మద్ సాధిక్ తండ్రి షేక్ ఫరీద్ షహనీసా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీస్ కమిషనర్ అమిత్గార్గ్ వద్ద వాపోయింది. తక్షణం పోలీసులు చర్యలు చేపట్టి నిందితుడ్ని అరెస్టు చేశారు.
నెల రోజులకిందట పెందుర్తిలో స్నేహితుడు సోదరికి వివాహానికై హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చిన ఓ యువతిపై గ్యాంగ్ రేప్ చేసిన ఘటనలో నలుగురు నిందితుల్ని పట్టుకుని అరెస్టు చేశారు.ఇరవై రోజుల కిందట పెందుర్తి జుత్తాడలో ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు.
మృగాళ్ల కిరాతకం
Published Sun, Apr 5 2015 3:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టాలీవుడ్ హీరోయిన్ ఫోన్ హ్యాక్.. బాధతో ఇన్ స్టాలో పోస్ట్
కుప్పంలో చంద్రబాబు రాజకీయంగా భూస్థాపితం కావడం ఖాయం: పెద్దిరెడ్డి
నర్రెడ్డి నాటకాలు చాలు
థ్యాంక్స్ టూ మనీష్ మల్హోత్రా.. సమ్మర్ 2024 స్పెషల్ డిజైన్స్ (ఫొటోలు)
సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
టీ20 వరల్డ్కప్ 2024 కోసం మరో జట్టు ప్రకటన
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్
‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
హైదరాబాద్లో భారీగా భూమిని కొన్న మైక్రోసాఫ్ట్!
తప్పక చదవండి
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
- ఓటు వేద్దాం ఇలా.!
- వెస్ట్ నైలు వైరస్ని తొలిసారిగా అక్కడ గుర్తించారు! ఎవరికి ప్రమాదమంటే..
- SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ఇలా అయితే..
- అధికారం శాశ్వతం కాదు.. వడ్డీతో చెల్లించే టైం వస్తుంది:కేటీఆర్
- ఎయిరిండియా సిబ్బంది సిక్ లీవ్.. 70కి పైగా విమానాలు రద్దు
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
Advertisement