రోడ్డుప్రమాదంలో మహిళ మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో మహిళ మృతి

Published Thu, Mar 5 2015 11:28 AM

a woman killed in road accident

అనంతపురం క్రైమ్: గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ మహిళ మృతిచెందింది. అనంతపురం జిల్లా సోమందేపల్లి జాతీయ రహదారిపై భారత్ పెట్రోలియం బంకు వద్ద గురువారం తెల్లవారుజామున ఒంటి గంటకు ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మృతిచెందిన మహిళ వివరాలు తెలియరాలేదు. పోలీసులు మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement