అభయ కేసు 11కు వాయిదా | Sakshi
Sakshi News home page

అభయ కేసు 11కు వాయిదా

Published Thu, Mar 6 2014 9:15 PM

Abhaya case adjourned to march 11

రంగారెడ్డి జిల్లా కోర్టులు: మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అభయ కేసువిచారణను ఎల్‌బీనగర్‌లోని సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జీ కోర్టుకు బదిలీచేశారు. సెషన్స్ కేసు నెం-51/14లో నిందితులైన సతీష్, వెంకటేష్‌లను జైలు అధికారులు గురువారం న్యాయస్థానంలో హాజరు పరిచారు. విచారణలో భాగంగా బాధితురాలిని డిఫెన్స్ కౌన్సిల్ విచారణ చేపట్టారు. తదుపరి సాక్షుల విచారణ కోసం కేసును ఈ నెల 11వ తేదీకి న్యాయమూర్తి నాగార్జున్ వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement