జీలుగుమిల్లి :రైతు నుంచి రూ.8 వేలు లంచం తీసుకుంటూ జీలుగుమిల్లి ట్రాన్స్కో ఏఈ అడపా వెంకటేశ్వరరావు అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కారు. ఏసీబీ డీఎస్పీ వి.గోపాలకృష్ణ కథనం ప్రకారం.. జీలుగుమిల్లి మండలం దర్భగూడెంకు చెందిన అలవాల గంగాధర్రెడ్డి అనే రైతు తన పొలంలో వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ట్రాన్స్ఫార్మర్ మంజూరు కాగా, దానిని ఏర్పాటు చేయాలంటే రూ.10 వేలు లంచం ఇవ్వాలని ట్రాన్స్కో ఏఈ అడపా వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.
అంత ఇచ్చుకోలేనని రైతు చెప్పడంతో, రూ.8 వేలు ఇవ్వాలని అడిగారు. దీంతో రైతు గంగాధరరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయిం చారు. వలపన్నిన ఏసీబీ అధికారులు రైతుకు రూ.8 వేలు ఇచ్చి దర్భగూడెంలోని ట్రాన్స్కో కార్యాలయానికి పంపించారు. రైతు గంగాధరరావు ఆ మొత్తాన్ని ఏఈ వెంకటేశ్వరరావుకు ఇస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ చెప్పారు. కేసు నమోదు చేశామని, ఏఈని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐ విల్సన్బాబు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఏసీబీకి పట్టుబడిన ఏఈ వెంకటేశ్వరరావు తాడేపల్లిగూడెంలో పనిచేస్తూ నాలుగు నెలల క్రితం ఇక్కడకు బదిలీపై వచ్చారు.
ఏసీబీకి చిక్కిన ట్రాన్స్కో ఏఈ
Published Wed, Feb 4 2015 12:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
వైఎస్ జగన్ కోసం రెండు నెలలుగా ప్రార్థనలు
ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్న రాహుల్
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement