2 కిలోల బంగారం.. 10 కిలోల వెండి.. | Sakshi
Sakshi News home page

2 కిలోల బంగారం.. 10 కిలోల వెండి..

Published Fri, Jun 23 2017 12:49 PM

2 కిలోల బంగారం.. 10 కిలోల వెండి.. - Sakshi

విజయవాడ: ప్రజారోగ్య శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ పాండురంగారావు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలపై రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి తనిఖీలు చేపడుతున్నారు. విశాఖ, విజయవాడ, గుంటూరు, పశ్చిమగోదావరి, హైదరాబాద్‌లోని 12 చోట్ల సోదాలు జరుగుతున్నాయి.

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నవోదయ కాలనీలో ఉన్న ఇంట్లో పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు గుర్తించారు. భారీ సంఖ్యలో బంగారు నాణేలు, బిస్కెట్లు ఆభరణాలు, వెండి ప్లేట్లు, గ్లాసులు లభ్యమయ్యాయి. గుర్తించిన వాటిలో 2కిలోల పైగా బంగారు ఆభరణాలు, 10 కేజీల పైగా వెండి ఆభరణాలు, వజ్రాలు ఉన్నట్లు సమాచారం. పాండురంగారావు సహా ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట పలు ప్రాంతాల్లో విలువైన ఆస్తులున్నట్లు గుర్తించారు. ఏసీబీ డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలోని బృందం గుర్తించిన ఆస్తుల విలువను లెక్కేస్తున్నారు.

విశాఖపట్నంలో ఆంధ్రా మెడికల్‌ కాలేజీ ప్రొఫెసర్‌ రవికుమార్‌ నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఏసీబీ నాలుగు బృందాలుగా విడిపోయి.. రవికుమార్‌తో పాటు ఆయన బంధువుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సోదాల్లో రూ. 65 కోట్ల అక్రమాస్తులు గుర్తించినట్లు తెలిసింది. విశాఖలోని నాలుగు చోట్ల ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. పాండురంగారావుకు రవికుమార్‌తో వ్యాపార సంబంధాలున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నట్టు సమాచారం.

 
Advertisement
 
Advertisement