విజయవాడ: ప్రజారోగ్య శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ పాండురంగారావు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలపై రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం నుంచి తనిఖీలు చేపడుతున్నారు. విశాఖ, విజయవాడ, గుంటూరు, పశ్చిమగోదావరి, హైదరాబాద్లోని 12 చోట్ల సోదాలు జరుగుతున్నాయి.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నవోదయ కాలనీలో ఉన్న ఇంట్లో పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు గుర్తించారు. భారీ సంఖ్యలో బంగారు నాణేలు, బిస్కెట్లు ఆభరణాలు, వెండి ప్లేట్లు, గ్లాసులు లభ్యమయ్యాయి. గుర్తించిన వాటిలో 2కిలోల పైగా బంగారు ఆభరణాలు, 10 కేజీల పైగా వెండి ఆభరణాలు, వజ్రాలు ఉన్నట్లు సమాచారం. పాండురంగారావు సహా ఆయన కుటుంబ సభ్యులు, బంధువుల పేరిట పలు ప్రాంతాల్లో విలువైన ఆస్తులున్నట్లు గుర్తించారు. ఏసీబీ డీఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలోని బృందం గుర్తించిన ఆస్తుల విలువను లెక్కేస్తున్నారు.
విశాఖపట్నంలో ఆంధ్రా మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ రవికుమార్ నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఏసీబీ నాలుగు బృందాలుగా విడిపోయి.. రవికుమార్తో పాటు ఆయన బంధువుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ సోదాల్లో రూ. 65 కోట్ల అక్రమాస్తులు గుర్తించినట్లు తెలిసింది. విశాఖలోని నాలుగు చోట్ల ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. పాండురంగారావుకు రవికుమార్తో వ్యాపార సంబంధాలున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నట్టు సమాచారం.
2 కిలోల బంగారం.. 10 కిలోల వెండి..
Published Fri, Jun 23 2017 12:49 PM
Advertisement
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- ఆహార ప్రియులకు అలర్ట్.. హోటళ్లు, రెస్టారెంట్లలో బయటపడ్డ లోపాలు
- ఢిల్లీలో తగ్గిన పోలింగ్ శాతం
- ఓటీటీలో అదరగొడుతున్న టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
- నవీన్ పట్నాయక్పై అస్సాం సీఎం హిమంత సంచలన ట్వీట్
- స్కానింగ్ సెంటర్లో టెక్నీషియన్ వికృత చేష్టలు.. న్యూడ్ ఫొటోలు తీసి..
- T20 World Cup 2024: సెమీస్కు చేరే జట్లు ఇవే..!
- పన్ను చెల్లింపు దారులకు అలెర్ట్.. మరో 3 రోజుల్లో ముగియనున్న గడువు
- కవితకు బెయిల్ ఇవ్వొద్దు. . హైకోర్టులో ఈడీ, సీబీఐ వాదనలు
- రూ.1,323 కోట్లు పరిహారం కోరనున్న కళానిధిమారన్
- ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట
Advertisement