మునగపాక : విశాఖ జిల్లా మునగపాక మండలం తిమ్మరాజిపేట వద్ద బుధవారం సాయంత్రం బస్సు ఢీకొని ఓ విద్యార్థి మృతి చెందాడు. పోలీసుల సమాచారం ప్రకారం..అచ్యుతాపురం మండలం తిమ్మరాయిపేటకు చెందిన మహేష్(14) బైక్పై వెళ్తుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బ్రాండిక్స్ కంపెనీకి చెందిన బస్సు ఢీకొనడంతో మహేష్ మృతి చెందాడు.
దీంతో మృతుని బంధువులు, స్థానికులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. దాదాపు కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయి, ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పాడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.