ముండ్లమూరు : మోదేపల్లి మేజర్ పరిధిలోని సాగర్ ఆయకట్టు భూములకు వాటా ప్రకారం నీరు అందించి రైతులను ఆదుకోవాలని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డి సంబంధితాధికారులకు ఆదేశించారు. దర్శి మాజీ శాసనసభ్యుడు బూచేపల్లి సుబ్బారెడ్డితో కలిసి శుక్రవారం సాయంత్రం పర్యటించారు. పీబీసీ పరిధిలోని రవ్వారం లాకుల వద్ద జమ్మలమడక మేజర్, మోదేపల్లి మేజర్లకు సంబంధించిన నీటి పంపకాలు ఎలా జరుగుతున్నాయనే వివరాలు
అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మోదేపల్లి మేజర్లో ఆయకట్టు గ్రామాలైన ఉమామహేశ్వరపురం, ఈదర, కొమ్మవరం, వేములబండ, అయోధ్యనగర్, రమణారెడ్డిపాలెం, నాయుడుపాలెం, పూరిమెట్ల గ్రామాల్లోని దిగువ భూములకు నీరు సరఫరా కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండల వైసీపీ కన్వీనర్ సుంకర బ్రహ్మారెడ్డి ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. నాట్లు వేయడం పూర్తి కాకముందే అధికారులు వారాబంధి విధానాన్ని అమలు చేస్తున్నారని, మోదేపల్లి మేజర్కు వాటా ప్రకారం 365 క్యూసెక్కుల నీరు రావాల్సి ఉండగా 150 క్యూసెక్కులకు మించి రావడంలేదని ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం మోదేపల్లి మేజర్లో 2,300 ఎకరాలలో, జమ్మలమడక మేజర్లో 1600 ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేశారని, సాగు ఎక్కువగా ఉన్న మోదేపల్లి మేజర్కు అదనంగా నీరు సరఫరా చేసి రైతులను ఆదుకునేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన ఎంపీ సాగర్ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు. నీటి సరఫరా విషయంలో రైతులను ఇబ్బంది పెట్టవద్దన్నారు. వాటా ప్రకారం నీరు రప్పించి రైతులకు సరఫరా చేయాలని సూచించారు.
ఇప్పటికే అన్నదాతలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, ఇలాంటి సమయంలో నీరు సక్రమంగా పంటకు అందకుంటే నష్టాలపాలవుతారనే విషయాన్ని అధికారులు గుర్తించుకోవాలన్నారు. ఎన్ఎస్పీ సిబ్బంది నిత్యం కాలువపై పర్యటించి నీటి సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎన్ఎస్పీ డీఈ ఎ.అనుమాయమ్మ, ముండ్లమూరు, తాళ్ళూరు వైసీపీ కన్వీనర్లు బ్రాహ్మారెడ్డితోపాటు వెంకటరెడ్డి, రైతులు అన్నపురెడ్డి భిక్షాలురెడ్డి, చింతా శ్రీనివాసరెడ్డి, గాదె నాసరరెడ్డి, సుంకిరెడ్డి, చింతల అంజిరెడ్డి, గూడాల సుబ్బారెడ్డి, బిజ్జం సుబ్బారెడ్డి, సురా గురుస్వామిరెడ్డి, మన్నంగి అంజిరెడ్డి, ఇరుగుల కొండారెడ్డి, అబ్బని అంజిరెడ్డి, మైలా శ్రీరాములు, జే ఈలు క్రాంతికుమార్, శివరామకృష్ణ, ప్రసాదులు ఉన్నారు.
వాటా ప్రకారం నీరు అందించాలి: ఎంపీ వైవీ సుబ్బారెడ్డి
Published Sat, Dec 27 2014 2:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement