ఒంగోలు వన్టౌన్ : బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రవాణా, రోడ్లు, భవనాలశాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో బాలికల రక్షణ కోసం అవసరమైన చర్యలపై చర్చిస్తామన్నారు. ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అసోసియేషన్స్ (ఐఫియా), ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక మౌర్య కాన్ఫరెన్స్ హాలులో ‘బాలికల విద్య, రక్షణ, ఉపాధ్యాయుల పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన జాతీయస్థాయి సెమినార్కు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
కార్యక్రమానికి ఏపీటీఎఫ్ గౌరవాధ్యక్షుడు కె.సుబ్బారావు, ఐఫియా అధ్యక్షుడు బ్రిజునందన్శర్మ, ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్యామ్సుందరరావు అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ బాలికల విద్య, వారి మేలు కోసం ప్రభుత్వం ఏం చేయాలో ఉపాధ్యాయులు తమ దృష్టికి తెస్తే వాటిని అమలు చేస్తామని పేర్కొన్నారు.
బాలికలకు విద్యాబుద్ధులు నేర్పించి వారిలో జీవననైపుణ్యాలు పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ప్రధానంగా విద్యార్థినులకు ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. సెమినార్లో బాలికల విద్య, రక్షణ గురించి చర్చించటం ఆనందంగా ఉందన్నారు. వక్తల సూచనలు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. బాలికలకు విద్యనందించి బాల్యవివాహాలు జరగకుండా చూడాలని ఉపాధ్యాయులను మంత్రి కోరారు.
పేదరికాన్ని నిర్మూలించాలి
సమావేశంలో పలువురు వక్తలు ప్రసంగించారు. కుటుంబ పేదరికాన్ని నిర్మూలించాలని, విద్య అవసరాన్ని అందరికీ తెలియజేయాలని, సామాజిక స్పృహతో కూడిన విద్యనందించి బాలికలకు చైతన్యవంతుల్ని చేయాలని చెప్పారు. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించాలని, స్త్రీలకు రక్షణ కల్పించాలని, బాలికలకు పాఠశాలల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. బూర్జువా, ఉగ్రవాద సంస్కృతిని ప్రేరేపించే కార్యక్రమాలను నిలుపుదల చేయాలన్నారు.
మహిళల విద్య పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండాలని కోరారు. విద్య కోసం కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో 6 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం నిధులు కేటాయించి మెరుగైన విద్యనందించాలని వక్తలు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. మంత్రి శిద్దా రాఘవరావుకు జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో ఐఫియా కార్యవర్గ సభ్యులు ఎం.రాఘవరావు, ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.హృదయరాజు, ఐఫియా ప్రధాన కార్యదర్శి వివేకానంద దాస్, శ్రీప్రసాద్ జాదవ్, శివకుమార్, పీఆర్టీఎఫ్ అధ్యక్షుడు ఎం.మల్లయ్య, సాలిగ్రామ్ బిరూడ్ (మహారాష్ట్ర) కమల్ లోచన్ బిశ్వాల్, కిరణ్జ్యోతి, మాధవ్శర్మ, జి.సత్యనారాయణ, ఎ.సదాశివరావు, ఎం.విశ్వభారతి, కె.వెంకటేశ్వరరావు, శైలజా, శివలీల, సీహెచ్ వెంకటకుమారి, పీవీ సుబ్బారావు తదితరులు మాట్లాడారు.
బాలికలపై వేధింపుల నిరోధానికి చర్యలు
Published Mon, Aug 25 2014 3:18 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement