తిరుపతి రూరల్:
వైఎస్సార్ జిల్లాలో రైతు సమస్యలను విస్మరించి విద్యుత్ అధికారులు అధికార పార్టీ తొత్తుల్లాగ వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులు ధ్వజమెత్తారు. వైఎస్సార్ జిల్లాలో రైతులు విద్యుత్ సరఫరా, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటులో ఎదుర్కొంటున్న సమస్యలపై శనివారం తిరుపతిలోని డిస్కం కార్పొరేట్ కార్యాలయంలో సీఎండీ హెచ్వై దొరను కలసి చర్చించారు. రైతులకు ఉచిత విద్యుత్ నిరంతరాయంగా సరఫరా కావడం లేదని, కేవలం ఆరుగంటలే ఇస్తున్నా అది కూడా రెండు, మూడు విడతలుగా సరఫరా చేస్తున్నారని వివరించారు. వైఎస్సార్ జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీరు పనితీరు బాగాలేదని, జెడ్పీ మీటింగ్కు కూడా హాజరు కావడం లేదని సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఎంపీ అవినాష్రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్రెడ్డి, రఘురామిరెడ్డి, ఆదినారాయణరెడ్డి, అంజాద్బాషా, జయరాములు, శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటులో అధికారులు వివక్ష చూపుతున్నారని తెలిపారు. ముందు చలానా కట్టిన రైతులను విస్మరించి పచ్చనేతలు రెకమండ్ చేసిన వారికి బిగిస్తున్నట్టు చెప్పారు. కొత్తగా సబ్స్టేషన్లు ఏర్పాటు చేయాలని సీఎండీని కోరామన్నారు. సబ్స్టేషన్లలో కాంట్రాక్టు పోస్టులను అధికార పార్టీ నేతలతో కలసి అధికారులు అమ్మేసుకుంటున్నారని ఆరోపించారు. జిల్లాలో కరెంటు సమస్యలపై స్థానిక అధికారులు స్పందించకపోవడంతో సీఎండీని కలసి విన్నవించామన్నారు. సీఎండీ సైతం అధికార పార్టీకి వత్తాసుగా మాట్లాడడం బాధ కలిగించిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ గ్రామాల్లో 50 యూనిట్ల విద్యుత్ ఉచితమని ప్రకటించినా క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదని పేర్కొన్నారు. అధికారులు సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కడప జెడ్పీ చైర్మన్ గూడూరు రవి, భరత్రెడ్డి పాల్గొన్నారు.
అధికారులా...అధికారపార్టీ తొత్తులా?
Published Sun, Sep 28 2014 2:28 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement