'చావు కబురుచల్లగా చెప్పిన చంద్రబాబు' | Sakshi
Sakshi News home page

'చావు కబురుచల్లగా చెప్పిన చంద్రబాబు'

Published Mon, Dec 1 2014 4:40 PM

'చావు కబురుచల్లగా చెప్పిన చంద్రబాబు' - Sakshi

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. కొండను తవ్వి ఎలుకను పడుతున్నారని వైఎస్సార్ సీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ఎద్దేవా చేశారు. జపాన్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని వస్తారని అందరూ ఆశించారని, కాని ఆయన చావు కబురుచల్లగా చెప్పారని అన్నారు. నమ్మకం కుదిరితేనే జపాన్ కంపెనీలు పెట్టుబడులు పెడతాయని ఇప్పుడు చెబుతున్నారని పేర్కొన్నారు.

తొమ్మిదేళ్ల పాలనా కాలంలో చంద్రబాబు తీసుకొచ్చిన పెట్టుబడులు గురించి వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఈ నాలుగేళ్లలో సింగపూర్, జపాన్ నుంచి ఎన్నివేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తారో చెప్పగలరా అని ప్రశ్నించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement