చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్లైన్ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖలో నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఆ శాఖ జాయింట్ డెరైక్టర్ జే.రవికుమార్ తెలిపారు. శుక్రవారం జిల్లా శాఖ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రబీ సీజన్ నుంచి వ్యవసాయ శాఖలో నగదు బదిలీ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. తొలుతగా సబ్సిడీపై ఇచ్చే వేరుశెనగ విత్తనకాయల కొనుగోలు నుంచి ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు.
బస్తా వేరుశెనగ విత్తనకాయలు రూ.1,620
ఈ సీజన్లో జిల్లాలోని తూర్పున 25 మండలాల్లో వేరుశెనగ పంట సాగుచేసే రైతుల కోసం నవంబర్ మొదటి వారం నుంచి విత్తనకాయలు అందుబాటులో ఉంచుతామని జేడీ వెల్లడించారు. ఇప్పటివరకు 24 వేల క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. నగదు బదిలీ పథకం కింద బస్తా (30 కిలోలు) వేరుశెనగ కాయలను రూ.1,620 వెచ్చించి రైతు కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. కొనుగోలు సమయంలో పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు పాస్ పుస్తకం కచ్చితంగా సమర్పించాలని సూచిం చారు. ఆ తర్వాత సబ్సిడీ కింద రూ.540లు రైతు వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామని తెలిపారు.
64,060 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు
రబీ సీజన్లో జిల్లాలోని 64,060 హెక్టార్ల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తారని జేడీ పేర్కొన్నారు. తూర్పు మండలాల్లో ప్రధాన పంటగా వరి 37,491 హెక్టార్లు, వేరుశెనగ 16,330, మిరప 2249, పొద్దుతిరుగుడు 2597, రాగి 821, మొక్కజొన్న 704, ఉద్దులు 1013, ఉలవలు 1768, పొగాకు 123, ఎర్రగడ్డలు 196 , పత్తి 118 హెక్టార్లు, కాగా మిగిలిన విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తారని తెలిపారు.
అందుబాటులో ఎరువులు
రబీ సీజన్కు గాను వివిధ రకాల ఎరువులు జిల్లాలోని రైతులకు అందుబాటులో ఉంచామని జేడీ తెలిపారు. యూరియా 11600 మెట్రిక్ టన్నులు, డీఏపీ 2773 టన్నులు, ఎంవోపీ 839, కాంప్లెక్స్ ఎరువులు 8400 టన్నులు అందుబాటులో ఉన్నాయన్నారు. నవంబర్ మొదటి వారంలో మరో 26 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లాకు వస్తాయని ఆయన వివరించారు.
వ్యవసాయశాఖలో ‘నగదు బదిలీ’
Published Sat, Oct 26 2013 3:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement