రాజంపేట రూరల్ : తమ బాండ్లకు సంబంధించి నగదు చెల్లించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని అగ్రిగోల్డ్ బాధిత ఐక్య సాధన సమితి జిల్లా కార్యదర్శి వి.ప్రసాద్, రాజంపేట అధ్యక్షుడు పీవీ సుబ్బారావు అన్నారు. రాజంపేట బైపాస్ రోడ్డులోని అగ్రిగోల్డ్ కార్యాలయం వద్ద బాధితులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీ వో కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. యజమాన్యానికి వ్యతిరే కంగా నినాదాలు చేశారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ రాజంపేటలో 2011లో అగ్రిగోల్డ్ సంస్థ ప్రత్యేక బ్రాంచి ఏర్పాటు చేసిందన్నారు.
ఈ బ్రాంచిలో సుమారు 2 వేల మందికి పైగా ఏజెంట్లు ఉన్నారని తెలిపారు. 50 వేల మందికి పై గా వినియోగదారులు ఉన్నారని పేర్కొన్నారు. ఈ బ్రాంచ్లో వారు రూ. 55 కోట్లకు పైగా డిపాజిట్లు చేశారన్నారు. కాల పరిమితి ముగిసిన బాండ్లకు నగదు ఇమ్మని అడిగితే సీబీఐ విచారణ పేరు తో కాలయాపన చేస్తోందన్నారు. బాధితులకు బీజేపీ నేత నాగోతు రమేష్నాయుడు మద్దతు పలికారు. ర్యాలీలో పా ల్గొన్న ఆయన మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులను వెంటనే ఆదుకోవాలన్నారు.
అగ్రిగోల్డ్ సంస్థ నుంచి రావాల్సిన మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితులు ఐక్యసాధన సమితి స భ్యులు కృష్ణయ్య, ఆర్.సుబ్బయ్య, పి. రాము, డి.లక్ష్మీవరప్రసాద్, ఎం.పెంచలయ్య, మురళీ, నవనీతమ్మ, గోవిందరా జు, రెడ్డమ్మ, వారధి, ఎ.పెంచలరావు, ఏ బీవీపీ జిల్లా నేత గుణవర్మ పాల్గొన్నారు.
‘అగ్రిగోల్డ్’ బాధితుల ఆందోళన
Published Sun, Jun 14 2015 2:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement