► 35,992 మంది విద్యార్థుల కోసం 164 కేంద్రాలు
► తొలిసారిగా సీసీఈ విధానంలో పరీక్ష
► జంబ్లింగ్ విధానంలో ఇన్విజిలేటర్ల నియామకం
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 164 కేంద్రాల్లో 35,992 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. సీసీఈ విధానం ద్వారా తొలిసారి 80 మార్కులకు పరీక్షలు జరగనుండగా గతంకంటే 15 నిమిషాలు అదనపు సమయాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సీసీఈ మోడల్లో ప్రశ్నపత్రం ఇవ్వడంతో చదువుకునేందుకు ఈ సమయాన్ని ప్రభుత్వం కేటాయించింది. పది పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12.15 గంటల వరకు ఉంటాయి. అన్ని కేంద్రాల్లో ఖచ్చితంగా బెంచీలు ఉండేటట్లు చూడాలని రాష్ట్ర అధికారులు ఆదేశించడంతో అందుకుతగ్గ ఏర్పాట్లను జిల్లా అధికారులు చేస్తున్నారు.
5 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు: పది పరీక్షలను నిర్వహించేందుకు, పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్కు విద్యార్థులు పాల్పడకుండా ఉండేందుకు అధికారులు ఐదు సెంటర్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో తాళ్లపొద్దుటూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాల, కమలాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల, దువ్వూరు జెడ్పీ ఉన్నత పాఠశాల, చక్రాయపేట మండలం గండిలోని గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాల, పెనగలూరు మండలం చక్రంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు.
సమస్యాత్మక కేంద్రాలుగా 8 సెంటర్లు: జిల్లాలోని ఎనిమిది సెంటర్లను సమస్యాత్మక సెంటర్లుగా గుర్తించారు. ఇందులో నందిమండలం జెడ్పీ ఉన్నత పాఠశాల, వనిపెంట గురుకుల పాఠశాల, గండి గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాల, మఠం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కడప జయనగర్కాలనీ(ప్రైవేటు సెంటర్), తాళ్లపొద్దుటూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాల, కమలాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల, దువ్వూరు జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈ సెంటర్లపై స్క్వాడ్ ప్రత్యేక దృష్టిపెట్టనుంది.
50 మంది స్పెషల్ ఆఫీసర్ల నియామకం: పది పరీక్షల్లో ఎలాంటి ఆరోపణలకు తావివ్వకుండా ప్రతి మండలానికి ఒక జిల్లా అధికారిని స్పెషల్ ఆఫీసర్గా కలెక్టర్ కేవీ సత్యనారాయణ నియమించారు. వీరు ఆయా మండలాల్లోని సెంటర్లలో ఉండే విద్యార్థులు మాస్కాపీయింగ్కు పాల్పడకుండా ప్రత్యేక పర్యవేక్షణను చేయనున్నారు. దీంతోపాటు విద్యాశాఖ మరో 20 టీంలను పరీక్షల పర్యవేక్షణకు నియమించింది. ఈ స్క్వాడ్లోని ప్రతి బృందంలో విద్యాశాఖ నుంచి ఒకరు, రెవెన్యూ నుంచి ఒకరు. పోలీస్వాఖ నుంచి ఒకరు ఉంటారు. వీరు ముగ్గురు కలిసి ఒక బృందంగా ççపరీక్షల తీరును పర్యవేక్షించనున్నారు.
ఇన్విజిలేటర్ల నియామకంలో జంబ్లింగ్: ఈసారి జరిగే పది పరీక్షల్లో మాస్కాఫీయింగ్కు తావ్వకుండా గతమెన్నడూ లేని విధంగా కలెక్టర్ పరీక్షలకు వెళ్లే ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ విధానంలో విధులను నియమించనున్నారు. ఈ మేరకే కలెక్టర్ నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ విధానం కిందిస్థాయిలో అమలు కొంతమేర కష్టతరం అవుతుందని మేధావులు, విద్యావంతులు అంటున్నారు. ఎందుకుంటే పరీక్ష 9.30 గంటలకు ప్రారంభం అయితే పరీక్ష నిర్వహించే రోజు ఉదయం 7 గంటలకు ఇన్విజిలేటర్ల సెల్కు ఏసెంటర్ అనేది మెసేజ్ వస్తుందని కలెక్టర్ గారు చెప్పారు. ఇది అమలు కొంతమేర కష్టతరంగా ఉంటుందని పలువురు అంటున్నారు. కొన్ని కారణాల చేత ఇన్విజిలేటర్ల సెల్కు మేసేజ్ చేరకపోయినా సంబంధిత ప్రక్రియ జరగడం కొంతమేర ఆలస్యమైనా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని పలువురు అంటున్నారు.
25 యాక్టు అమలు: రాష్ట్ర ప్రభుత్వం ఈఏడాది నుంచి 25 యాక్టు (ప్రిలెన్స్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్)ను అమలు చేయనుంది. ఈ యాక్టు వల్ల పరీక్ష కేంద్రాలలోని విద్యార్థులు మాల్ప్రాక్టీస్కు పాల్పడితే సంబంధిత సెంటర్ ఇన్విజిలేటర్ని బాధ్యుడిగా చేయనుంది. దీంతో అతనిపై కేసు నమోదు చేయడంతోపాటు చర్యలు తీసుకోనున్నారు.
అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం: పది పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లను చేస్తున్నాం. ఎక్కడా కూడా నేలబారు పరీక్షలు లేకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆయా మండలాల ఎంఈఓలను ఆదేశించాం. మేము కూడా పర్యవేక్షిస్తున్నాం. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు అన్ని చర్యలను తీసుకుంటున్నాం. ---పొన్నతోట శైలజ, జిల్లా విద్యాశాఖాధికారి
పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
Published Wed, Mar 15 2017 12:49 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement