కర్నూలు(అగ్రికల్చర్): ఆళ్లగడ్డ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు మంగళవారం నోటిఫికేషన్ జారీ కానుంది. అదే రోజు నుంచి నామినేషన్ల ఘట్టం కూడా మొదలు కానుంది. నామినేషన్ల పర్వం మొదలు కానుండడంతోనే రాజకీయ సందడి నెలకొననుంది. నామినేషన్లు ఈ నెల 21వ తేదీ వరకు స్వీకరిస్తారు. ఉప ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా నంద్యాల ఆర్డీఓ సుధాకర్రెడ్డి వ్యవహరిస్తారు. ఆళ్లగడ్డ తహశీల్దార్.. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా ఉంటారు.
నామినేషన్లు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తారు. నామినేషన్ సమయంలో పోటీ చేసే అభ్యర్థులు రూ.10 వేలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇందులో 50 శాతం చెల్లిస్తే సరిపోతుంది. పోటీ చేసే అభ్యర్థులను నియోజకవర్గానికి చెందిన 10 మంది ఓటర్లు బలపరచాల్సి ఉంది. నవంబర్ 8వ తేదీన పోలింగ్ జరగనుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా పోలింగ్ నిర్వహిస్తారు.
గత ఎన్నికల్లో ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా భూమా శోభా నాగిరెడ్డి పోటీ చేశారు. నామినేషన్ల ఉపసంహరణ పూర్తి అయి పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటించిన తర్వాత రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. అప్పటికే పోటీలో ఉన్న అభ్యర్థుల ప్రకటన పూర్తి అయినందున ఎన్నికలు నిర్వహించారు. మరణించిన శోభా నాగిరెడ్డి ఎన్నికల్లో గెలుపొందారు. శోభా నాగిరెడ్డి భౌతికంగా లేకపోవడంతో మళ్లీ ఎన్నిక నిర్వహించడం అనివార్యమైంది.
ఇప్పటికే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పార్టీ అభ్యర్థిగా దివంగత శోభానాగిరెడ్డి కూతురు భూమా అఖిలప్రియ పేరును ప్రకటించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం ఎన్నికను ఏకగ్రీవం చేసే దిశగా ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఇది నామినేషన్ల ఘట్టం పూర్తయ్యేలోపు స్పష్టం కానుంది. ఆళ్లగడ్డ నియోజకవర్గం ఉప ఎన్నిక ఈ ఏడాది జనవరి ఒకటిన ప్రచురించిన ఓటర్ల జాబితా ప్రకారం జరుగుతుంది.
మొత్తం ఓటర్లు 2,20,812 మంది ఉండగా, ఇందులో మహిళలు 1,11,997 మంది, పురుషులు 1,08,800 మంది, ఇతరులు 15 మంది ఉన్నారు. గత నెల చివరి వారం నుంచి ఈనెల 10వ తేదీ బీఎల్ఓలు ఇంటింటి సర్వే చేసి చనిపోయిన వారు, డబుల్ ఎంట్రీలు, గ్రామాలు వదిలి వెళ్లిన వారిని గుర్తించడంతో పాటు అర్హులైన వారి నుంచి ఫారం-6లు కూడా స్వీకరించారు. ఇందులో ఓటర్ల సంఖ్యలో స్వల్ప హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది. నియోజకవర్గంలో ప్రస్తుతం 267 పోలింగ్ కేంద్రాలు ఉండగా, అదనంగా 8 కొత్త పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి.
నియోజకవర్గాన్ని సందర్శించిన కలెక్టర్
నామినేషన్ల ఘట్టం మంగళవారం నుంచి మొదలు కానుండటంతో జిల్లా కలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ సోమవారం నియోజకవర్గాన్ని సందర్శించారు. అధికారులతో సమావేశమై నామినేషన్లలో ఎలా వ్యవహరించాలనేది వివరించారు. ఎన్నికను పకడ్బందీగా, నిస్పక్షపాతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు మండలానికి ఒక మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్ను నియమించారు. అక్రమ మద్యం, నగదును అరికట్టేందుకు 12 చెక్పోస్టులు ఏర్పాటయ్యాయి.
ఇది ఎన్నికల షెడ్యూలు :
నామినేషన్లు - ఈ నెల 14 నుంచి
21వ తేదీ వరకు
పరిశీలన - ఈనెల 22న
ఉపసంహరణ - ఈనెల 24న
పోలింగ్ - నవంబర్ 8న
ఓట్ల లెక్కింపు - నవంబర్ 12న
ఆళ్లగడ్డ ఉప ఎన్నికకు నేడే నోటిఫికేషన్
Published Tue, Oct 14 2014 12:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
తప్పక చదవండి
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement