తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో గురువారం జరిగిన నవనిర్మాణ దీక్షల ముగింపు సభలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అయితే ఆయన పర్యటన సందర్భంగా ప్రజలు నానా అవస్థలు పడ్డారు. అంతే కాకుండా కాన్వాయ్ వెళ్లడం కోసం అంబులెన్స్ను సైతం అడ్డుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాకినాడలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో బయటకొచ్చింది.
గురువారం కాకినాడలో సీఎం చంద్రబాబు పర్యటనలో భాగంగా పోలీసులు ట్రాఫిక్ను నిలిపివేశారు. ఈ ట్రాఫిక్ లో ఓ అంబులెన్స్ కూడా ఉంది. అయితే అదేమి పట్టించుకోని పోలీసులు అంబులెన్స్కు దారి ఇవ్వలేదు. కాన్వాయ్ వెళ్లిన తర్వాతే ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. దీన్ని వీడియో తీసిన ఓ వ్యక్తి పేస్ బుక్ లో పోస్టు చేశారు.ఈ ఘటనపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.