భువనగిరి, న్యూస్లైన్: పాల సేకరణ ధరను బుధవారం నుంచి పెంచుతున్నట్టు నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ, సహకార సంఘం (నార్మాక్) చైర్మన్ గుత్తా జితేందర్రెడ్డి తెలిపారు. ఇది పాడి రైతులకు నూతన సంవత్సర కానుక అని ఆయన చెప్పారు. భువనగిరి మిల్క్ చిల్లింగ్ సెంటర్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాణ్యమైన గేదెపాలు లీటరుకు రూ.46 నుంచి రూ.50కి, ఆవుపాల ధర రూ. 21.97 నుంచి రూ.23.22కు పెంచినట్లు జితేందర్రెడ్డి చెప్పారు. ఎన్నో ఒడిదొడుకులు ఎదురవుతున్నా రైతుల ప్రయోజనమే ధ్యేయంగా నార్మాక్ ముందుకు సాగుతోందన్నారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటూ, సంక్షేమ పథకాలను అందిస్తోందన్నారు. ప్రైవేట్ డెయిరీల పోటీని తట్టుకుంటూ ఎల్లకాలం రైతులకు అందుబాటులో ఉండి సేవలందించే సంస్థ నార్మాక్ మాత్రమేనని ఆయన స్పష్టంచేశారు.
ప్రస్తుతం కరెంట్ చార్జీలు, ఉద్యోగుల జీతాలు, డీజిల్ చార్జీలు పెరిగినా అనవసరపు ఖర్చులను తగ్గించుకుని రైతులకు అధిక రేటు చెల్లిస్తున్నామన్నారు. గతంలో రైతుల నుంచి సేకరించిన రూపాయి కన్వర్షన్ చార్జీలు సుమారు రూ.2 కోట్ల 11 లక్షలను సంక్రాంతి నుంచి సుమారు 60మంది రైతులకు చెల్లిస్తామని తెలిపారు. ప్రస్తుతం లక్షా యాభైవేల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. ఇందులో కేవలం లక్ష లీటర్ల పాలను మాత్రమే అమ్ముతున్నామని, మిగతా పాలతో ఇతర ఉత్పత్తులు తయారు చేసి విక్రయిస్తున్నామని ఆయన చెప్పారు. ఇందులో మిల్క్ కేక్, కర్డ్కప్స్, బట్టర్మిల్క్, పన్నీర్, వెన్న, నెయ్యి తయారు చేసి అమ్ముతున్నట్లు చెప్పారు. తమ డీలర్లతో పాటు, అన్ని మిల్క్ చిల్లింగ్ సెంటర్లలో వీటిని అమ్మకానికి పెడుతున్నట్లు చెప్పారు. శుభకార్యాలకు ఆర్డర్లపై పెరుగును సరఫరా చేయనున్నట్లు వివరించారు. విలేకరుల సమావేశంలో సంస్థ ఎండీ సురేష్బాబు, జీఎం రమేష్, డెరైక్టర్లు కాయితి వెంకట్రెడ్డి, పి. భూపాల్రెడ్డి, చిన్నన ర్సింహారెడ్డి, ఎన్. భిక్షపతి, శ్రీశైలం, పట్నం అమరేందర్ పాల్గొన్నారు.
పాడిరైతుకు ‘కొత్త’ కానుక
Published Wed, Jan 1 2014 12:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement