సాక్షి ప్రతినిధి, గుంటూరు
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో అంతర్మథనం ఆరంభమైంది. మిత్రపక్షం బీజేపీ వ్యవహారశైలి, పార్టీ, ప్రభుత్వపరంగా గుర్తింపు లభించక పోవడంతో అధికారం వచ్చిన సంతోషం నేతల్లో కనిపించడం లేదు. పదేళ్లుగా పార్టీని బతికించుకోడానికి పడిన కష్టాలన్నీ తొలగిపోతాయని భావించిన నేతలకు భిన్న పరిస్థితులు ఎదురవుతుంటే కలత చెందుతున్నారు.
పార్టీ అధికారంలో ఉందో ప్రతిపక్షంలో ఉందో అర్థం కావడం లేదని ఆందోళన చెందుతున్నారు. జిల్లా, మండల పరిషత్ సమావేశాలు, పార్టీ సమావేశాల్లో ఇదే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు బిజీబిజీగా ఉంటున్నారే కాని తమ సమస్యలు అర్థం చేసుకోవడం లేదని, అసలు దర్శన భాగ్యమే లభించడం లేదంటున్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులెవరూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు.
జిల్లాలో బలపడేందుకు మిత్రపక్షం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు కూడా టీడీపీ నేతలను కలవర పెడుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరడాన్ని టీడీపీ ముఖ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని బద్ధ శత్రువుగా చూసిన కన్నాతో ఇప్పుడెలా మైత్రీ బంధం కొనసాగించాలో అర్థం కావడం లేదంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ అధికారంలో బీజేపీ భాగస్వామిగా కొనసాగుతుండటంతో జిల్లాలోనూ కన్నా చుట్టూ అధికారం కేంద్రీకృతమౌతుందనే భయం వారిని వెన్నాడుతోంది.
రానున్న నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయరు పదవి తమకు కావాలం టూ బీజేపీ నేతల డిమాండ్కు కన్నా చేరిక మరింత బలం చేకూర్చుతుందనే భావన వ్యక్తం అవుతోంది.
ఇటీవల పార్టీలో చేరిన తాడిశెట్టి మురళీకి కన్నాతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో మేయరు పదవిని బీజేపీ డిమాండ్ చేసే అవకాశాలున్నాయని టీడీపీ నేతలంటున్నారు. వీరి చేరికతో మేయరు పదవిపై టీడీపీ ఆశలు ఆవిరవుతున్నాయి.
అధికారం వచ్చి ఆరు నెలలైనా ప్రభుత్వపరంగా ఎలాంటి ప్రయోజనాలు లభించకపోవడంతో సీనియర్లు, కార్యకర్తలు మధనపడుతున్నారు. మండల స్థాయి అదికారులు కూడా తమ మాట ఖాతరు చేయడం లేదని, వారిపై ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందుబాటులో ఉండటం లేదంటున్నారు.
మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్బాబులకు కీలక శాఖలు ఉండటంతో జిల్లా కంటే ఇతర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటున్నారు. సమస్యలు వచ్చినప్పుడు కనీసం ఫోన్కు కూడా అందుబాటులోకి రాకపోవడంతో నేతలు తల్లడిల్లిపోతున్నారు.
జిల్లాలో సొంత కార్యాలయాలు, సమస్యల పరిష్కారానికి బాధ్యులను ఏర్పాటు చేయకపోవడంతో వారి పట్ల పార్టీలో క్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది.
ఎంపీలు, ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇందుకు మినహాయింపు కాకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక జిల్లా పరిషత్, మండల పరిషత్, పార్టీ సమావేశాల్లో టీడీపీ నేతలు తమ ఆవేదనను బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు.
టిడిపిలో అంతర్మథనం
Published Sun, Nov 2 2014 3:27 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement