సాక్షి, హైదరాబాద్: పాలెంలో వోల్వో బస్సు దుర్ఘటనకు బెంగళూరులో అరెస్ట్ చేసిన షబ్బీర్, అక్రం, రఫీక్, అమానుల్లాలే కారణమని సీఐడీ అధికారుల దర్యాప్తులో తేలింది. మహబూబ్నగర్ జిల్లా పాలెం వద్ద గత అక్టోబర్ 30న బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న జబ్బార్ ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్సు అగ్నిమాదానికి గురై 45 మంది సజీవదహనమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే జబ్బార్ ట్రావెల్స్ యజమానితోపాటు బస్సు డ్రైవర్ను అరెస్ట్ చేయగా.. గురువారం రాత్రి బెంగళూరులో షబ్బీర్, అక్రం, రఫీక్, అమానుల్లాలను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. సీఐడీ డీఎస్పీ నోముల మురళీ నేతృత్వంలోని ప్రత్యేక బృందం వీరిని బెంగళూరులో అదుపులోకి తీసుకుంది. వీరిలో అక్రం వోల్వో బస్సుకు మె యింటెనెన్స్, షబ్బీర్ కార్గో పనులు చూస్తుండగా, అమానుల్లా, రజాక్ టికెట్లు ఇచ్చే వారని తేలింది. వీరిపై సీఆర్పీసీలోని సెక్షన్ 336 కింద కేసులు నమోదు చేశారు.
బస్సులో 39 మంది ప్రయాణికులను ఎక్కించాల్సి ఉండగా.. వీరు అత్యాశకు పోయి 52 మందిని ఎక్కించారని సీఐడీ అదనపు డీజీ కృష్ణప్రసాద్ శుక్రవారం ‘సాక్షి’తో చెప్పారు. షబ్బీర్ నిబంధనలకు విరుద్ధంగా మండే గుణం ఉన్న వస్తువులను కూడా బస్సులో చేర్చినట్లు తేలిందన్నారు. మెయింటెనెన్స్ చూసే అక్రం, బస్సులో ఎమర్జెన్సీ డోర్ సక్రమంగా పని చేస్తుందా లేదా అనేది తనిఖీ చేయలేదన్నారు. అలాగే బస్సులో ఉండాల్సిన ఎమర్జెన్సీ హ్యామర్స్ను ఉంచలేదని, ప్రమాదం జరిగితే బస్సు అద్దాలను పగులగొట్టి వెలుపలికి ఎలా రావాలో జాగ్రత్తలను ప్రయాణికులకు సూచించలేదని ఆయన వివరించారు. బస్సు ప్రమాదానికి వీరు నేరుగా బాధ్యులు కాకపోయినా.. నిబంధనలు పాటించకపోవడంతో ఈ దుర్ఘటనకు వీరు సహకరించినట్లు అయ్యిందన్నారు. వీరిని కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలిస్తామని కృష్ణప్రసాద్ చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు ముగియలేదని, ఎవరెవరు బాధ్యులనే దానిపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.
‘పాలెం’ దుర్ఘటనకు ఆ నలుగురే బాధ్యులు
Published Sat, Jan 11 2014 4:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
హీరామండి సిరీస్లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష.. ఏపీలో 29 పరీక్షా కేంద్రాలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (03-05-2024))
లైంగిక ఆరోపణల కేసు.. రేవణ్ణ అరెస్టు
ఆర్సీబీతో మ్యాచ్.. గుజరాత్ జట్టులోకి కొత్త ప్లేయర్! తుది జట్లు ఇవే
గవర్నర్పై ఆరోపణలు.. మమత సర్కారు దూకుడు
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీ దుష్ప్రచారంపై ఈసీ సీరియస్
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement