ఏపీ అఖిలపక్షం ఆందోళన
సాక్షి, హైదరాబాద్: స్థానికతను నిర్ధారించడానికి 1956కు ముందునుంచి ఉన్న వారంటూ తెలంగాణ ప్రభుత్వం కుట్రచేసే ప్రయత్నం చేస్తోందని, దీనివల్ల ఉభ య ప్రాంతాల విద్యార్థులు నష్టపోతారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ఆందోళన వ్యక్తంచేసింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చాంబర్లో శనివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్బాబు, వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ ఉప నాయకుడు జ్యోతుల నెహ్రూ, ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీనివాసులు, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. దాదాపు గంటసేపు చర్చలు జరిగాయి. సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాలరెడ్డి కూడా పాల్గొన్నారు. అనంతరం మంత్రులు విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు స్థానికత నిర్ణయించే విషయంలో తెరమీదకు తెస్తున్న అంశంతోపాటు ఎంసెట్ కౌన్సెలింగ్పై చర్చించినట్టు చెప్పారు. ఒక వ్యక్తి స్థానికతకు సంబంధించి రాజ్యాంగం నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలుండగా ఇదో సమస్యగా మారటం ఆందోళన కల్గించే అంశమని వైఎస్సార్సీపీ నాయకులు జ్యోతుల చెప్పారు.
కోర్టుకు వెళ్లడంపై పరిశీలిస్తున్నాం: చంద్రబాబు
తెలంగాణలో స్థానికత నిర్ధారణకు 1956వ సంవత్సరమే ప్రాతిపదికగా తీసుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించటంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. శనివారం ఆయన శాసనసభ్యుల రెండు రోజుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడారు. స్థానికతపై తెలంగాణ సర్కారు నిర్ణయంపై ఏం చేస్తే బాగుంటుందో ఆలోచిస్తున్నామన్నారు. కోర్టుకు వెళ్లటంతోపాటు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.
స్థానికత వెనుక కుట్ర
Published Sun, Jul 20 2014 1:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు
తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
హ్యాట్రిక్ కొట్టిన ఆర్సీబీ.. ఆ జట్లకు హెచ్చరిక
‘బినామీలు బయటపడతారు.. అదే చంద్రబాబు భయం’
దిగ్విజయ్ సింగ్ భావోద్వేగ లేఖలో ఏముంది?
KKR vs LSG: విజయం ఎవరిని వరిస్తుంది?
CSK vs PBKS: గెలుపు ఎవరిదో?
Children's Inspirational Story: 'యుద్ధకాంక్ష'! పూర్వం సింహపురిని..
సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement