ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం

Published Mon, Feb 16 2015 10:48 AM

andhra pradesh cabinet meeting begin

హైదరాబాద్:  ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సోమవారమిక్కడ ప్రారంభమైంది. కేంద్రం నుంచి రావల్సిన నిధులు, బడ్జెట్‌లో వివిధ శాఖలకు  కేటాయింపులపై ఈ భేటీలో కేబినెట్‌ చర్చించనుంది. ముఖ్యంగా ల్యాండ్‌ పూలింగ్‌, తాత్కాలిక రాజధాని ఏర్పాటు, నూతన పారిశ్రామిక విధానం, ఎంసెట్‌ నిర్వహణపై కెబినెట్‌లో చర్చ జరగనుంది.

 

అలాగే కృష్ణా జలాల వివాదం, వేసవిలో విద్యుత్‌, తాగునీటి సమ్యలపైనా చర్చించనున్నట్లు సమాచారం. అలాగే రోడ్డుప్రమాదాలు, కొత్త పింఛన్ల మంజూరుపై కేబినెట్లో నేతలు చర్చించే అవకాశం ఉంది.  ఫిబ్రవరి 14తో భూ సమీకరణ గడువు ముగియగా, దాన్ని ఈ నెలాఖరు వరకూ గడువు పొడిగించనున్నారు.

Advertisement
Advertisement