'టీడీపీ గుర్తింపును రద్దు చేయండి' | Sakshi
Sakshi News home page

'టీడీపీ గుర్తింపును రద్దు చేయండి'

Published Sat, Dec 6 2014 12:30 PM

andhra pradesh congress leaders meet governor

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం గవర్నర్ నరసింహన్ను కలసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. గవర్నర్తో సమావేశమైన వారిలో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు పళ్లంరాజు, చిరంజీవి, సుబ్బిరామిరెడ్డి తదితరులు ఉన్నారు.

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చలేదని కాంగ్రెస్ నాయకులు గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. 11 అంశాలపై 12 పేజీల నివేదికను గవర్నర్కు అందజేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement