అనైతిక కార్యకలాపాలను విడనాడాలి | Sakshi
Sakshi News home page

అనైతిక కార్యకలాపాలను విడనాడాలి

Published Wed, Feb 26 2014 4:14 AM

anger to so many problems


 
 ముదినేపల్లి రూరల్,  : ప్రజలు అనైతిక కార్యకలాపాలను విడనాడి శాంతి భద్రతలను పరిరక్షించేందుకు సహకరించాలని ముదినేపల్లి ఎస్‌ఐ వి.సతీష్ కోరారు. మండలంలోని బొమ్మినంపాడు శివారు జానకిగూడెం, పాత, కొత్త దళితవాడలు, కొరగుంటపాలెం, శ్రీహరిపురం గ్రామాల్లో మంగళవారం జనమైత్రి సమావేశాలు నిర్వహించారు.

 

ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ జూదాలు, మద్యపానం విడనాడితేనే సమాజంలో గౌరవప్రదమైన హోదా దక్కుతుందన్నారు. గ్రామాల్లో ఘర్షణలకు తావు లేకుండా స్థానికంగా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచిం చారు. ఆయా గ్రామాల సర్పంచులు నేతల రూప, అచ్యుత రాంబాబు, బడుగు జయమ్మ, పలువురు వార్డు సభ్యులు పాల్గొన్నారు.
 
 

Advertisement
Advertisement