తెల్ల కార్డుదారులందరికీ రెండు కిలోలు ఇవ్వాలి
ప్రజలందరికీ రక్షిత మంచినీరు అందించాలి
అధికారులు నెలకు ఒక్కో నియోజకవర్గంలో రెండు మండలాల్లోనైనా పర్యటించాలి
సమీక్షలో కలెక్టర్ సిద్ధార్థ్జైన్
పీలేరు: ‘ఓ పద్ధతి లేకుండా ఎవరికి పడితే వారికి ఉల్లి ఇచ్చేస్తే అర్హులైన నిరుపేదలకు ఎలా అందుతుంది’ అంటూ కలెక్టర్ సిద్ధార్థ్జైన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి పీలేరు వీఎస్ఆర్ కల్యాణ వేదికలో అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి తెల్ల రేషన్ కార్డుదారునికీ రెండు కిలోల చొప్పున ఉల్లి అందజేయాలన్నారు. ఇష్టానుసారం ఎవరికి పడితే వారికి ఇవ్వడమేంటని మండిపడ్డారు. ఉపాధి హామీ సిబ్బంది, అధికారులు తమకు సంబంధం లేకుండా రెవెన్యూ అధికారులే అమ్ముతున్నారని కలెక్టర్కు తెలిపారు. జిల్లాలో నెలకు రూ.40 కోట్లు పెన్షన్లు ఇస్తున్నామని, లబ్ధిదారులకు పింఛన్ అందుతుందా లేదా అన్న విషయం ఎంపీడీవో విచారించాలన్నారు. వృద్ధులు రాలేని స్థితిలో ఉంటారని, వారందరికీ ఇంటింటికీ వెళ్లి అందజేయాలని సూచించారు. ఉపాధిలేదని ఏ ఒక్కరూ ఇతర ప్రాంతాలకు వలసలు వె ళ్లాల్సిన అవసరం లేదన్నారు. కూలీలందరికీ స్థానికంగానే పనులు కల్పించాలన్నారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
ఏమిచేస్తారో ఏమోకానీ ప్రజలందరికీ విధిగా రక్షిత మంచినీరు అందించాలని ఆదేశించారు. డబ్బులతో ఇబ్బందిలేదన్నారు. జిల్లా అధికారులు నెలలో ఒక్కో నియోజకవర్గంలో కనీసం రెండు మండలాల్లోనైనా పర్యటించాలన్నారు. హార్టికల్స్ పనితీరుపై సంతృప్తిగా లేనన్నారు. మండలానికి ఇద్దరు మోటార్ మెకానిక్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు, కళాశాలలకు తాగునీరు అందించాల్సిన బాధ్యత అధికారులదేనని తెలిపారు. విద్య, వైద్యం, విద్యుత్, పంచాయతీ, వ్యవసాయం తదితర శాఖల పనితీరుపై సమీక్షించారు. జిల్లా సంయుక్త కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, వివిధ శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉల్లి సరఫరాపై ఆగ్రహం
Published Tue, Sep 8 2015 2:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
Advertisement