Sakshi News home page

బాబు మోసంపై ఆంధ్రాలో ఆగ్రహం

Published Fri, Dec 5 2014 12:29 PM

బాబు మోసంపై ఆంధ్రాలో ఆగ్రహం - Sakshi

హైదరాబాద్: చంద్రబాబు నాయుడు మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా రైతులు, డ్వాక్రా మహిళలు పోరుబాట పట్టారు. రుణమాపీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మహాధర్నాకు విశేష స్పందన వచ్చింది. అనంతపురం జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు పెద్ద ఎత్తున జనంతరలివచ్చాన బాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర జిల్లాల్లో


తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన ధర్నాకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో బైకు ర్యాలీ నిర్వహించారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వైఎస్ఆర్ సీపీ మహాధర్నాకు అద్భుత స్పందన వచ్చింది. పార్టీ నాయకులు ధర్మాన ప్రసాదరావు, ఆళ్లనాని, మేకా శేషుబాబు, కొత్తపల్లి సుబ్బరాయుడు, కారుమూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చేపట్టిన మహాధర్నాలో పార్టీ నేతలు కొడాలి నాని, ప్రతాప్ అప్పారావు, పేర్ని నాని, వంగవీటి రాధాకృష్ణ, గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ సీపీ శ్రేణులతో పాటు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో మహాధర్నా కొనసాగుతోంది. రైతులు, డ్వాక్రా మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

నెల్లూరు కలెక్టరేట్ వద్ద జరుగుతున్న వైఎస్ఆర్ సీపీ మహాధర్నాలో ఎంపీలు రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్తో పాటు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ పాల్గొన్నారు. రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఒంగోలు జరిగిన మహాధర్నాలో వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అశోక్ రెడ్డి పాల్గొన్నారు. రైతులు, డ్వాక్రా మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

Advertisement
Advertisement