బాక్సైట్పై పోరాటానికి గిరిజనులు సిద్ధం
దోపిడీ కోసమే చంద్రబాబు అరకు దత్తత
అసెంబ్లీలో స్పీకర్లా వ్యవహరించిన పోలీసులు
రాజేంద్రపాలెం ప్రజా చైతన్య సదస్సులో అమర్నాథ్
కొయ్యూరు : ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలు చేపృితే స్వాతంత్య్ర ఉద్యమం నాటి మన్యం పితూరిలా మరో పోరా టం తప్పదని వైస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నా రు. బాణాలు ఎక్కుపెట్టయినా బాక్సై ట్ను అడ్డుకుంటామన్నారు. మండల కేం ద్రం కొయ్యూరులో ప్రజా వ్యతిరేక విధానాలపై పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అధ్యక్షతన చైతన్య సదస్సును శనివారం నిర్వహించారు. అమర్నాథ్ మాట్లాడుతూ పోలీసుల తూటాలకు భయపడే స్థితిలో గిరిజను లు లేరన్నారు. బాక్సైట్ను దోపిడీ చేసేందుకే సీఎం చంద్రబాబు అరకును, మరో మంత్రి లంబసింగిని దత్తత తీసుకున్నారని ఆరోపించారు. ఖనిజ తవ్వకాలతో రైవాడ జలాశయం పూర్తిగా ఎండిపోతుందన్నారు. మైదానంలోని తాండవ వంటి మేజర్ ఆయుకట్టుకు సాగునీరందక బంగారం పండే భూృుులు బీడువారుతాయన్నారు. సమావేశానికి అనుమతి ఇవ్వకుండా పోలీసులు మొదటి నుంచి ఇబ్బం దులు పెట్టారన్నారు. తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఈ సదస్సుకు హాజరు కావలసి ఉండగా ఎస్పీ నుంచి అనుమతి లేకపోవడంతో నలుగురు మాత్రమే వచ్చారన్నారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు రోజా దీనికి రావలసి ఉండగా.. ఆమె వస్తే సమావేశానికి అనుమతి ఇచ్చేది లేదని చెప్పడం శోచనీయమన్నారు. రోజాకు భయపడే రానీయలేదని ఆరోపించారు.
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం వైఎస్సార్ సీపీ నేత అనంత ఉదయభాస్కర్ మాట్లాడుతూ అసెంబ్లీలో స్పీకర్లా పోలీసులు కట్ చేయడం దురదృష్టకరమన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం ఏర్పాటయిన ఐటీడీఏలు వారి బాగును పట్టించుకోవడం లేదన్నారు. హోరున వర్షం కురుస్తున్నప్పటికీ మధ్యాహ్నం 12.30 గం టల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సమావేశానికి పెద్ద సంఖ్యలో వచ్చిన గిరిజనులు అలాగే ఉన్నారు. సమావేశంలో అరకు పార్లమెంట రీ నియోజకవర్గం పరిశీలకుడు బొడ్డేడ ప్రసాద్, జెడ్పీటీసీలు పోలుపర్తి నూకరత్నం, పద్మకుమాని, నళిని కృష్ణ, ఎంపీపీ బాలరాజు, నేతలు కర్రినాయుడు, టీఎస్ రాందాస్,గాడి సత్యనారాయణృ, ఎస్వి రమణమూర్తి, రంపచోడవరానికి చెందిన రామకృష్ణ, జీకేవీధి, చింతపల్లి, జి. మాడుగుల, పాడేరు,పెదబయలు ప్రాంతాలనుంచి వచ్చిన నాయకులు,సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రామరాజ్యం సీపీఎం నుంచి బూరుగులయ్య, పీసా కమిటీల నుంచి ప్రసాద్ పాల్గొన్నారు.
సర్వశక్తులు ఒడ్డి అడ్డుకుంటాం
సర్వశక్తులు ఒడ్డి బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుంటాం. నాడు వందేమాతర ఉద్యమం మాదిరి బాక్సైట్ ఉద్యమాన్ని కొనసాగిస్తాం. అణిచివేయాలనిచూస్తే తిరుగుబాటు తప్పదు. సంప్రదాయ ఆయుధాలతో పోరాటం సాగిస్తాం. గిరిజనం నోరునొక్కేస్తున్న ప్రభుత్వానికి గిరిజనం తగిన బుద్ధి చెబుతారు. టీడీపీ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు. అర్హులకు అందడం లేదు. 50 ఏళ్లు నిండిన అందరికి పెన్షన్లు అని చెప్పి ఇప్పుడు లేవంటూ మెలిక పెడుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాకుండా ప్రత్యేకప్యాకేజీఅంటూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
- గిడ్డి ఈశ్వరి, ఎమ్మెల్యే, పాడేరు
బాక్సైట్పై నోరు నొక్కేసిన ప్రభుత్వం
బాక్సైట్పై నోరు తెరవగానే ప్రభుత్వం దానిని బయటకు రాకుండా నొక్కేసింది. అసెంబ్లీలో ప్రతిపక్షం సభ్యలుమాట్లాడే సమయంలో స్పీకర్ ఎలా మైక్ కట్ చేస్తారో ఇక్కడ కూడా పోలీసులు అదే విధంగా చేశారు. సభకు అధ్యక్షత వహించిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడిన అనంతరం మాజీ ఎమ్మెల్యే జి. దేముడు మాట్లాడుతూ బాక్సైట్ అంశాన్ని ప్రస్తావించగానే సీఐ సోమశేఖర్ మైక్ కట్చేశారు. దీంతో పోలీసులు, ప్రజాప్రతినిధుల మధ్య సుమారు 20 నిమిషాల పాటు వాగ్వాదం చోటుచేసుకుంది.
మన్యంలో మరో ఉద్యమం
Published Sat, Sep 12 2015 11:36 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement