పెంటపాడు : జాతీయ రహదారిపై తాడేపల్లిగూడెం ఆటోనగర్ సమీపంలోని బ్రిడ్జి మలుపు ముగ్గురు ప్రాణాలను బలిగొంది. పుష్కర యూత్రికులు ప్రయూణిస్తున్న రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందగా 13 మందికి గాయూలయ్యూరుు. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ విషాద ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన 9 మంది గురువారం ఉదయం పెనుగొండ మండలం సిద్ధాంతం వద్ద పుష్కర స్నానాలు చేసి మహీంద్రా కారులో తిరుగు ప్రయాణమయ్యారు.
ఇదే సందర్భంలో ప్రకాశం జిల్లా ఒంగోలుకు సమీపంలోని ఇడుపులపాడుకు చెందిన ఆరుగురు నిస్సాన్ కారులో పుష్కర స్నానాలకు వెళ్తున్నారు. ప్రత్తిపాడు వద్ద రైల్వే కం రోడ్డు బ్రిడ్జి దిగుతుండగా నల్లపాడుకు చెందిన మహీంద్ర కారు మలుపు తప్పించే క్రమంలో డివైడర్ దాటి కుడివైపున వెళ్తున్న నిస్సాన్ కారును రాంగ్రూట్లో వెళ్లి ఢీకొట్టింది. ప్రమాదంలో నిస్సాన్ కారులో ప్రయాణిస్తున్న ఇడుపులపాడుకు చెందిన బుడవల రామకృష్ణ (42), అదే గ్రామానికి చెందిన పుల్లెల భూషారావు (40) అక్కడికక్కడే మృతి చెందారు. అదే కారులో ప్రయాణిస్తున్న పుల్లెల భూషారావు భార్య లక్ష్మికి రెండు కాళ్లు విరిగిపోయాయి.
మరో మహిళ పుల్లెల సుబ్బరావమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి. బుడవల శైలజ, బుడవల మానస సాయికి పలుచోట్ల గాయాలయ్యాయి. మహీంద్ర కారులో ప్రయాణిస్తున్న కొఠారి పుట్టయ్య (65) తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించగా కొద్దిసేపటికే మృతి చెందాడు. ఆ కారులో ప్రయాణిస్తున్న షేక్ సాయి, మన్నిడి శ్రీనివాసరావు, అతని భార్య నాగమణి, అతని తల్లి సామ్రాజ్యం, బావ కొఠారి వెంకటేశ్వరరావు, చెల్లి ఆదిలక్ష్మి, చిన్నారులు శ్రావణి, గౌతమి తీవ్రంగా గాయపడ్డారు. ఏడాది చిన్నారి మన్నిడి అనన్య స్వల్పంగా గాయపడింది. క్షతగాత్రులను తొలుత తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలకు తరలించారు.
మరో పుష్కర విషాదం...
Published Fri, Jul 24 2015 2:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement