నగరానికి మణిమకుటం
ఇనార్బిట్మాల్తో మారనున్న
విశాఖ రూపురేఖలుశరవేగంగా జరుగుతున్న ఇనార్బిట్ మాల్
నిర్మాణ పనులుసాక్షి, విశాఖపట్నం : ఒక ప్రాజెక్టు.. నగర స్వరూపాన్నే మార్చేస్తుంది. ఉదాహరణకు హైదరాబాద్నే తీసుకుందాం. దుర్గం చెరువు ప్రాంతమంటే నగర శివారు. కానీ అక్కడికి ఇనార్బిట్ మాల్ వచ్చింది. అంతే కేవలం ఏడాది కాలంలోనే దుర్గం చెరువు రూపురేఖలు మారిపోయాయి. ముఖ్యమైన సెంటర్గా, రద్దీ ప్రాంతంగా, వ్యాపార, వాణిజ్య, ఉపాధికి కేంద్రంగా నిలిచింది. ఇప్పుడు అదే ప్రాజెక్టు విశాఖ నగరం నడిబొడ్డున నిర్మితమవుతోందంటే ఆ ప్రాంతం ఇంకెంతలా అభివృద్ధి చెందుతుందో ఊహించుకోవచ్చు. నగరంలోని ప్రధాన రహదారికి సమీపంలో దక్షిణాదిలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ని రహేజా సంస్థ నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏకంగా 11 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రహేజా పనులు ఎలా సాగుతున్నాయి.. ఇనార్బిట్ మాల్ రాకతో కై లాసపురం ప్రాంతం మరో ఏడాది కాలంలో ఎలా మారబోతోందో ఓసారి పరిశీలిస్తే..
రూ.600 కోట్లతో ఇనార్బిట్ మాల్ను నిర్మించేందుకు రహేజా సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మాల్ పనులకు గతేడాది ఆగస్ట్ 1న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. రహేజా గ్రూప్స్ ప్రెసిడెంట్ నీల్ రహేజా ఆహ్వానం మేరకు సీఎం జగన్ ఈ కీలక ప్రాజెక్టు పనులకు పచ్చజెండా ఊపారు. అప్పటి నుంచి ఎలాంటి అవరోధాలు లేకుండా శరవేగంగా పనులు జరుగుతున్నాయి.
రెండో దశలో ఐటీ స్పేస్ ఏర్పాటు
ఇక్కడ ఐటీ స్పేస్ కూడా ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ సంస్థ ప్రెసిడెంట్ నీల్ రహేజాకు శంకుస్థాపన రోజు సూచించారు. ముఖ్యమంత్రి అడిగిన వెంటనే.. రహేజా సైతం అక్కడే ప్రకటించింది. మొదటి దశ పూర్తయిన తర్వాత.. రెండో దశలో ఐటీ స్పేస్ నిర్మాణం చేపడతామని స్పష్టం చేసింది. 2.5 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో ఐటీ స్పేస్ ఏర్పాటు కానుంది. దీనికి సమీపంలోనే కన్వెన్షన్ సెంటర్ కూడా రాబోతోంది.
మాల్తో మారబోతోందిలా..?
ఇనార్బిట్ మాల్లో కీలకమైన షాపింగ్ మాల్స్ రానున్నాయి. దేశీయ, విదేశీ రెస్టారెంట్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ప్లే ఎరీనా, హోటల్స్, రీటైల్షాపింగ్, థియేటర్స్.. ఇలా భిన్నమైన వాణిజ్య సముదాయాలతో నిండిపోనుంది. ఇక్కడ కొనుగోలు చేసేందుకు రోజూ వేల మంది రానున్నారు. ఈ కారణంగా ప్రాంతమంతా జన రద్దీతో కళకళలాడుతుంటుంది. చుట్టుపక్కల చిన్న చిన్న దుకాణాల్లోనూ వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఐటీ పరిశ్రమలు, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటైతే.. తిరుగులేని ప్రాంతంగా డెవలప్ అవుతుంది. ఈ ప్రాంతంలోని ఇళ్లు, స్థలాలకు డిమాండ్ పెరుగుతుంది. కై లాసపురం కీలక కేంద్రంగా మారనుంది.
లూలూ వస్తే లాసే తప్ప.. లాభం లేదు.!
వేల మందికి ఉపాధినిచ్చే లూలూని తరిమేశారంటూ అడ్డగోలుగా పచ్చపత్రికల్లో కథనాలు రాస్తున్నాయి. దీని వెనుక ఉన్న కుంభకోణం, వాస్తవాల్ని ఓసారి పరిశీలిస్తే.. చంద్రబాబు ప్రభుత్వం విశాఖ బీచ్ ఎదురుగా ఉన్న రూ.680 కోట్ల విలువైన 13.59 ఎకరాల భూమిని నామమాత్రపు లీజుతో అంతర్జాతీయ కన్వెన్షనన్్ సెంటర్ పేరుతో లూలూ గ్రూపుకు కట్టబెట్టింది. పైగా 2017లో లీజు తీసుకున్ను లూలూ సంస్థ 2019 నవంబర్ వరకు ఒక్క రూపాయి లీజు కూడా చెల్లించలేదు. అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా టీడీపీ విధించిన నిబంధనలను అనుసరించే లూలూ గ్రూపుతో ఒప్పందాన్ని రద్దు చేసి, వందల కోట్ల విలువైన భూమిని వైఎస్ జగన్ ప్రభుత్వం కాపాడింది. లూలూ ఏర్పాటై ఉంటే.. విశాఖ ప్రజలకు తీరని నష్టం.. చంద్రబాబుకు గొప్ప లాభం ఉండేది. లూలూ వెళ్లిపోయిందంటూ పెడార్థాలు తీస్తున్న టీడీపీ, దుష్ట చతుష్టయానికి నగరం నడిబొడ్డులో నిర్మితమవుతున్న దక్షిణాదిలోనే అతిపెద్ద ఇనార్బిట్ మాల్ మాత్రం కనిపించకపోవడం విడ్డూరం. చురుగ్గా సాగుతున్న మాల్ నిర్మాణ పనులు
రూ.600 కోట్లతో 17 ఎకరాల్లో నిర్మాణం
గతేడాది ఆగస్ట్లో శంకుస్థాపన చేసిన సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి
తొలి దశలో 8 వేలు, రెండో దశలో 3 వేల మందికి ఉపాధి అవకాశాలు
సీఎం వైఎస్ జగన్ సూచనల మేరకు ఐటీ టవర్స్ ఏర్పాటు
రెండో దశలో 2.5 లక్షల చ.అడుగుల విస్తీర్ణంలో ఐటీక్యాంపస్ నిర్మాణంఇనార్బిట్మాల్ ప్రత్యేకతలు
నిర్మిస్తున్న సంస్థ : రహేజా గ్రూప్
విస్తీర్ణం : 17 ఎకరాలు
ఎక్కడ : ఉత్తర నియోజకవర్గంలోని
కై లాసపురంలో
ఎవరి స్థలం : విశాఖపట్నం పోర్టు అథారిటీ
లీజు : 30 ఏళ్లకు రూ.125 కోట్లు
చెల్లింపు
పూర్తయ్యేది : మూడేళ్లలో
నిర్మాణం ఎలా ఉంటుంది :
రెండు బేస్మెంట్ ప్లస్ 3 స్టిల్ట్ ఫ్లోర్స్,
5 ఫ్లోర్లు రీటైల్ కోసం, 6వ ఫ్లోర్ మల్టీలెవల్ కార్ పార్కింగ్ కోసం, 7,8 ఫ్లోర్లు ఆఫీస్ స్పేస్ కోసం, 9వ ఫ్లోర్లో హోటల్ కోసం నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు.
ఇప్పటివరకు ఈ మాల్స్
ఎక్కడెక్కడ ఉన్నాయి :
హైదరాబాద్, ముంబై(మలద్), నవీ
ముంబై(వసై), వడోదర, బెంగళూరు, పుణే ం ంప్రాజెక్టు వివరాలివీ...
ఫేజ్–1లో ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి రహేజా గ్రూప్ రూ.600 కోట్ల వ్యయం చేస్తోంది. 6 లక్షల చదరపు అడుగుల్లో మాల్, 4 లక్షల చదరపు అడుగుల పార్కింగ్ ప్రాంతం నిర్మించనుంది. 2026 కల్లా దీన్ని పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 250 జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ స్టోర్స్, మల్టిప్లెక్స్లు, ఫ్యామిలీ ఎంటర్టైనన్మెంట్ సెంటర్, ఫుడ్ కోర్టు, టెర్రస్ గార్డెన్, షాపింగ్ స్పేస్ రానున్నాయి. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 8 వేల మందికి ఉపాధి కలగనుంది. అన్నీ కూడా గ్రీనన్్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించనున్నారు. ఈ మాల్ని మూడేళ్లలోపు పూర్తి చేయాలని రహేజా సంస్థ లక్ష్యంగా నిర్దేశించుకుంది.