ఏపీ భవన్ ఖాళీ చేయాలని బాబుకు నోటీసులు | Sakshi
Sakshi News home page

ఏపీ భవన్ ఖాళీ చేయాలని బాబుకు నోటీసులు

Published Tue, Oct 8 2013 11:47 AM

ఏపీ భవన్ ఖాళీ చేయాలని బాబుకు నోటీసులు - Sakshi

న్యూఢిల్లీ : ఏపీ భవన్లో అనుమతి లేకుండా దీక్ష చేస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు అధికారులు మంగళవారం నోటీసులు ఇచ్చారు. ఏపీ భవన్ను తక్షణమే ఖాళీ చేయాలని వారు తమ నోటీసులో పేర్కొన్నారు. చంద్రబాబు దీక్షతో ఏపీభవన్కు వస్తున్నవారినకి ఇబ్బందులు వస్తున్నాయని అధికారులు నోటీసులో వెల్లడించారు. చంద్రబాబు నాయుడు అనుమతి తీసుకోకుండానే సోమవారం ఏపీ భవన్‌లో దీక్ష చేపట్టారు. ఇదే విషయాన్ని ఏపీ భవన్ రెసిడెంట్‌ కమిషనర్‌ స్పష్టం కూడా చేశారు. చంద్రబాబు దీక్షకు అనుమతి లేదని ఆయన చెప్పారు.  

మరోవైపు చంద్రబాబు దీక్షపై కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. బాబును తక్షణమే ఏపీ భవన్ నుంచి ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు. దీక్ష ఎందుకోసం చేస్తున్నారో చంద్రబాబు చెప్పాలని సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు.

Advertisement
Advertisement