టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి చేస్తున్న ఆరోపణల్ని ఇంకా పెద్దఎత్తున తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు మంత్రులు, పార్టీ నేతలకు ఉపదేశించారు. గురువారం ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ ముఖ్య నాయకులు, సమన్వయ కమిటీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ప్రధానంగా నంద్యాల ఉప ఎన్నికపైనే చర్చించినట్లు తెలిసింది. అక్కడ పర్యటించి వచ్చిన మంత్రులు గెలుపు ఖాయమని చెప్పడంతో.. అక్కడి వాస్తవ పరిస్థితులన్నీ తనకు తెలుసునని సీఎం ఒకింత ఆగ్రహంతో అన్నట్లు సమాచారం.
జగన్మోహన్రెడ్డి నంద్యాలలోనే మకాం వేసి విస్తృతంగా ప్రచారం చేస్తుండడం, చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలను పలువురు ప్రస్తావించారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ జగన్ చేస్తున్న ఆరోపణల్ని నాయకులు సరిగ్గా తిప్పికొట్టలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.తాను రెండు రోజులు నంద్యాలలో పర్యటించి అన్ని విషయాలు చెబుతానని, అప్పటిదాకా మంత్రులు, ముఖ్యనేతలు ప్రతిపక్షాన్ని దీటుగా ఎదుర్కొనాలని సూచించారు.
పార్టీశ్రేణులు మనోస్థైర్యం కోల్పోకుండా చూడండి
నంద్యాలలో ఓటమి తప్పదని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో పార్టీ శ్రేణులు మనోస్థైర్యం కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత మంత్రులపై ఉందని సీఎం సూచించినట్టు తెలుస్తోంది. ఓడిపోతామనే భయంతో వైఎస్సార్సీపీ శాంతిభద్రతల సమస్య సృష్టించడానికి ప్రయత్నిస్తోందని, ఎన్నికలు వాయిదా వేయించాలని చూస్తోందనే ప్రచారాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. దళితులపై మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు, బాలకృష్ణ పార్టీ కార్యకర్తపై చేయిచేసుకున్న అంశం, డబ్బు ఇవ్వడం తదితరాలపైనా సమావేశంలో చర్చించారు.
జగన్పై దాడిని ఇంకా పెంచండి
Published Fri, Aug 18 2017 1:39 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement