‘మంత్రుల వద్ద నా హవా ఎంటో చూస్తారా..!’-అంటూ ఆ అధికారి తన మిత్రబృందంతో జరిపే విందుల్లో చెప్పి మరీ డాబు ప్రదర్శిస్తున్నారు. ఏపీ సీఎం కార్యాలయంలోని ప్రత్యేకాధికారి(ఓఎస్డీ) ఒకరు ఈ మధ్య రాత్రిపూట సమయం సందర్భం లేకుండా మంత్రులకు ఫోన్లు చేసి సతాయిస్తున్న వైనం ఇప్పుడు మంత్రుల మధ్య హాట్టాపిక్గా మారింది. సీఎం చంద్రబాబుకు సన్నిహితుడని, అందులోనూ ఆయన కుమారుడికి మరింత సన్నిహితుడిగా పేరు పడిన ఆ అధికారి ఇటీవలి కాలంలో తన మొబైల్లో స్పీకర్ ఫోన్ ఆన్ చేసి మిత్రుల ముందు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదట!
రాత్రిపూట తన మిత్ర బృందంతో విందు సమావేశాల్లో పాల్గొనే సమయంలో తన సెల్ఫోన్ నుంచి తనకు తోచిన ఎవరో ఒక మంత్రికి ఫోన్ చే స్తున్నారట. అలా ఫోన్చేసి తనకు కావాల్సిన వివరాలు.. లేదా చేయాల్సిన పనుల గురించి చెబుతున్నారు. మిత్ర బృందం ముందు దర్పం ప్రదర్శించుకునేందుకు ఫోన్ స్పీకర్ ఆన్ చేసి మరీ మాట్లాడుతున్నారట. అవత లి నుంచి ఈ ఓఎస్డీ గారు ఫోన్ చేసిన మంత్రి.. నమస్కారం పెట్టగానే ఈయన కూడా నమస్కారం పెట్టి ఫలానా విషయం ఏమైంది అని ఒక్క మాట అలా స్పీకర్ ఆన్ చేసి మాట్లాడి ఇలా ఫోన్ కట్టేస్తున్నారట.
ఫోన్ చేసింది సీఎం కార్యాలయ ఓఎస్డీ కావడంతో అర్ధరాత్రి, అపరాత్రి అని తేడా లేకుండా ఫోన్లు ఎత్తి మంత్రులు సమాధానం ఇస్తున్నారట. ఫోన్ చేసిన ఓఎస్డీగారేమో తన హవా ఎలా నడుస్తుందో, మంత్రులు తన ఫోన్ అంటే ఎలా అర్ధరాత్రి పూట కూడా అటెన్షన్లో నిలబడి సమాధానం ఇస్తారో మిత్రులకు సవివరంగా చెబుతూ దర్పం ఒలకబోస్తున్నారట. ఈ విషయం మంత్రులకు తెలిసినా ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట!
ఓఎస్డీయా మజాకా!
Published Sun, May 3 2015 4:25 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సేవాలయకు రూ.27.12 లక్షల ఆర్థిక సాయం
ఎన్ఎస్ఈ ప్రతిపాదనను తోసిపుచ్చిన సెబీ..
హర్యానాలో బీజేపీ గట్టెక్కెనా?.. కాంగ్రెస్కు ఛాన్స్ ఎంత?
క్లుప్తంగా
జ్యోతిష్కుడు కిడ్నాప్
ఈవీఎంల భద్రతకు ముప్పులేదు
అమెరికా రాయబార కార్యాలయం ముట్టడికి యత్నం
నగల చోరీ కేసులో ఏడుగురి అరెస్టు
చైన్నె విమానాశ్రమంలో డీజీ యాత్ర సేవలు
భవానీ నదిలో మునిగి అన్నదమ్ముల మృతి
తప్పక చదవండి
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- నేడు ఏపీలో ప్రధాని ఎన్నికల ప్రచారం
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement