-సంతనూతలపాడు ఎమ్మెల్యే ఎ.సురేశ్ - సర్కారు జీవోలో బి.ఎన్.విజయ్కుమార్
అమరావతి: ప్రజాస్వామ విలువలకు పాతరేసి రాజ్యాంగ నిబంధనలను, చట్టాలను తుంగలో తొక్కుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకంగా ప్రజాప్రతినిధుల పేర్లను కూడా మార్చేస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి విచక్షణాధికారంతో మంజూరు చేసే ప్రత్యేక అభివృద్ధి నిధుల్లో అధికార దుర్వినియోగానికి, వివక్షకు పాల్పడుతున్నారు.
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆదిమూలపు సురేశ్నే రాష్ట్ర సర్కారు మార్చేసింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేగా కూడా గుర్తించడానికి బాబు సర్కారు ఇష్టపడటం లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి సంతనూతలపాడు నియోజకవర్గంలో సీసీ రహదారుల నిర్మాణానికి రూ.2కోట్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 31న ఉత్తర్వులు జారీ చేసింది.
ఆ ఉత్తర్వుల్లో సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్.విజయ కుమార్ వినతి మేరకు సీసీ రహదారులకు నిధులు మంజూరు చేసున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రణాళికా శాఖ ఎక్స్ ఆఫీషియో కార్యదర్శి సంజయ్గుప్తా జీవో ఆర్టీ.236 జారీ చేశారు. సంతనూతలపాడు నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ఎ.సురేశ్ ఎన్నికైనప్పటికీ జీవోలో ఎమ్మెల్యేగా ఎన్నిక కాని విజయ్కుమార్ను ఎమ్మెల్యేగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల అధికార యంత్రాంగమే విస్తుపోతోంది.
ప్రధాన ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి నిధులను మంజూరు చేయకుండా చంద్రబాబు వివక్షతో వ్యవహరిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వినతిపత్రాలను సమర్పించినప్పటికీ పట్టించుకోకుండా అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, లేదా ఇన్చార్జ్ నాయకుల పేరుతో నిధులను మంజూరు చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం చివరి రోజు మార్చి 31న హడావుడిగా ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి 31 నియోజకవర్గాలకు రెండేసి కోట్ల చొప్పున రూ.62 కోట్లను విడుదల చేస్తూ 31 జీవోలను జారీ చేయడం గమనార్హం.
మాడుగుల నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ ఆ ఎమ్మెల్యేను కాదని మాజీ ఎమ్మెల్యే పేరుతో నిధులను మంజురు చేశారు. అలాగే మార్కాపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తుండగా మాజీ ఎమ్మెల్యే పేరుతో నిధులను విడుదల చేశారు.
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పేరునే మార్చేశారు..
Published Tue, Apr 4 2017 7:51 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement