2019నాటికి పూర్తి చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
సాక్షి, విజయవాడ, అమరావతి: గోదావరి జలాలను 2018 నాటికి గ్రావిటీతో కృష్ణానదికి చేర్చడం, 2019 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద గోదావరి జలాలు కృష్ణానదిలో కలిసే చోట చంద్రబాబు గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం ఇచ్చే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. కొంతమంది కాపర్ డ్యాంకు, మెయిన్ డ్యాంకు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. చెరువులను గొలుసుకట్టుగా అనుసంధానం చేసి భూగర్భ జలాలను పెంచాలన్నారు. కంప చెట్లు, తుమ్మ చెట్లు తొలగించాలన్నారు. ఈ ఏడాది నాలుగు లక్షల పంటకుంటలు తవ్వాలని ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు.
గోదావరి నీళ్లను సోమశిలకు మళ్లిస్తాం
ఈ ఏడాది ఎన్ని ఇబ్బందులు వచ్చినా గోదావరి జలాలను కృష్ణాడెల్టాకు తెచ్చామని సీఎం చెప్పారు. కృష్ణా జలాలను నాగార్జునసాగర్ కుడికాల్వ ద్వారా రాయలసీమకు ఇచ్చి ఒక పంట కాపాడుకోగలిగామని చెప్పారు. రాబోయే రోజుల్లో గోదావరి జలాలు కృష్ణానదికి, అక్కడ నుంచి పెన్నానదికి తీసుకువెళ్లి సోమశిల ప్రాజెక్టు వరకు మళ్లిస్తామని చెప్పారు. కృష్ణా, గోదావరి డెల్టాల్లో నారుమళ్లు వేసుకుని పంటలు సకాలంలో పండించి తుపానుల బారిన పడకుండా చూసుకోవాలని రైతులకు సూచించారు.
ఏటా 50 కోట్ల మొక్కలు నాటాలి: సీఎం
రాష్ట్రవ్యాప్తంగా జూలై 1వతేదీన ‘వనం మనం’ కార్యక్రమాన్ని కోటి మొక్కలు నాటి పెద్ద ఎత్తున నిర్వహించాలని సీఎం చంద్రబాబు సూచించారు. గుంటూరు జిల్లా కొండవీడు నుంచి ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. కార్తీక మాసంలో జరిగే ‘వనమహోత్సవం’ వరకూ దీన్ని నిరాటంకంగా చేపట్టేందుకు మంత్రులతో పాటు అంతా బాధ్యత తీసుకోవాలని కోరారు.
పోలవరం మేమే కడతాం
Published Fri, Jun 30 2017 2:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
Advertisement