ఛత్తీస్‌గఢ్‌లో దారుణం | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌లో దారుణం

Published Thu, Nov 9 2017 9:43 AM

Ap man dies in thives attack in odisha

విజయనగరం : ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులపై దొంగలు దాడి చేశారు. ఓ కానిస్టేబుల్‌ను హత్యచేయడంతో పాటు మరొకరిని తీవ్రంగా కొట్టారు. కిరండోల్‌ ఆర్పీఎఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బచెలి రైల్వే యార్డులో బుధవారం రాత్రి ఇద్దరు దొంగలు వైర్లు దొంగతనాలు చేస్తుండగా.. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు అడ్డుకునే యత్నం చేశారు.

దీంతో దొంగలు వారిపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో ఓ కానిస్టేబుల్‌ మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతిచెందిన కానిస్టేబుల్‌ విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణానికి చెందిన సాంబశివరావుగా గుర్తించారు.

Advertisement
Advertisement