జగ్గయ్యపేట
తెలంగాణ ప్రభుత్వం విధించిన ప్రవేశ పన్నుకు నిరసనగా జగ్గయ్యపేట మండలంలోని గరికపాడు ఆర్టీఏ చెక్పోస్టు వద్ద ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల లారీ, టాక్సీ, ఇతర అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీలోని పలు జిల్లాలకు చెందిన యజమానులు, డ్రైవర్లు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన లారీ యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ నుంచి వచ్చే వాహనాలను పొరుగు రాష్ట్రాలకు చెందిన వాహనాలుగా గుర్తించి ప్రవేశ పన్ను చెల్లించాలంటూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్య వలన లారీ యజమానులు, డ్రైవర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉందన్నారు.
విభజన చట్టంలో ప్రవేశ పన్ను, రహదారి పన్ను, ఇతర ఫీజులు వసూలు చేయవ ద్దని ఉందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రవేశ పన్ను వసూలు చేయటంతో యజమానులు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో తీవ్రంగా చర్చించి పన్ను జీవోను వెంటనే రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. ఒకానొక సమయంలో ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా రోడ్డుపై నుంచి బయటకు లాగేశారు. ఈ ఆందోళనతో రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. స్థానిక శాసనసభ్యుడు శ్రీరాం రాజగోపాల్ ఆందోళనకారుల వద్దకు వచ్చి మద్దతు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి పన్ను రద్దుకు చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. దాదాపు గంటన్నర పాటు ఆందోళన సాగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యదర్శి యలమంచిలి వీర ఈశ్వరరావు, జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కోలేరు వెంకటరమేష్, విజయవాడ, రాజమండ్రి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, జగ్గయ్యపేట, వీరులపాడు, కంచికచర్ల ప్రాంతాలకు చెందిన లారీ యజమానుల సంఘం అసోసియేషన్ నాయకులు నాదెండ్ల కృష్ణ, సుంకర రమేష్, అప్పలరాజు, సురేష్, సత్యనారాయణ, నూకల శ్రీచంద్రశేఖర్, మండవ శ్రీధరన్, కర్రి విష్ణురెడ్డి, సూరపనేని సురేష్, సూరిబాబు, ఆదినారాయణ, ఇతర అనుబంధ సంఘాల యజమానులు పాల్గొన్నారు.
ఏపీ వాహనాల పన్నుపై చర్చించాలి
Published Wed, Apr 15 2015 5:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement