ప్రభుత్వం విజయయాత్రలకు సిద్ధం కావడం విడ్డూరం | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం విజయయాత్రలకు సిద్ధం కావడం విడ్డూరం

Published Fri, May 8 2015 10:47 PM

ap raithu sangham fires on government

విజయవాడ: రాష్ట్రంలో రైతు రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాకుండానే ప్రభుత్వం విజయయాత్రలకు సిద్ధం కావడం విడ్డూరంగా ఉందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి వంగల సుబ్బారావు, ఉపాధ్యక్షుడు పీ నరసింహారావులు ధ్వజమెత్తారు. శుక్రవారం ఉదయం విజయవాడ సుందరయ్యభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వంగల మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 32.66 లక్షల మంది రైతులకు రుణమాఫీ అమలు కాలేదన్నారు.

మొదటి జాబితాలో రూ.50 వేల లోపు రుణం తీసుకున్న రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌తో సంబంధం లేకుండా పూర్తిగా రుణమాఫీ చేసి రైతుల ఖాతాల్లో పూర్తి మొత్తాన్ని జమ చేస్తామని 2014 డిసెంబరు 11న జీవో ఎంఎస్ నెంబరు 220 ద్వారా ప్రకటించిన ప్రభుత్వం ఆయా హామీని నిలబెట్టుకోలేదన్నారు. రుణమాఫీ పూర్తి కాకుండానే మే 15 నుంచి విజయ యాత్రలు నిర్వహించాలని కేబినెట్ నిర్వహించడం సబబు కాదన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement