హత్య కేసులో నిందితులు అరెస్ట్ | Sakshi
Sakshi News home page

హత్య కేసులో నిందితులు అరెస్ట్

Published Fri, Jul 24 2015 2:22 AM

arrest of the accused in the murder case

నంద్యాలటౌన్: లింగంపల్లి సురేష్ హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ శశికుమార్, వన్‌టౌన్ సీఐ ప్రతాపరెడ్డి తెలిపారు. స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెళ్లడించారు. బండి ఆత్మకూరు మండలం చిన్నదేవళాపురం గ్రామానికి చెందిన లింగపల్లి సురేష్ రామకృష్ణల మధ్య కొన్నేళ్లుగా పొలం గట్ల విషయంలో తగాదా ఉందన్నారు. పలుమార్లు వీరు ఘర్షణ పడ్డారని చెప్పారు. దీంతో 17వ తేదీ అర్థరాత్రి దాటాక 1.30సమయంలో సురేష్‌బాబుపై రామకృష్ణ, రమేష్, మనోహర్‌లతో పాటు మరొకరు గొడ్డలి, కత్తులు, కర్రలతో దాడిచేసి హత్య చేశారన్నారు.  నిందితులు రామకృష్ణ, రమేష్, మనోహర్‌లను నంద్యాల పట్టణ శివారులోని అయ్యలూరు మెట్ట వద్ద అరెస్ట్ చేసి వీరి నుంచి గొడ్డలి, కత్తి, రెండు కర్రలను స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని చెప్పారు. విలేకరుల సమావేశంలో వన్‌టౌన్ ఎస్‌ఐ సాయినాథ్, బండిఆత్మకూరు ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement