కుప్పం ఎమ్మెల్యేగా బాబు సమైక్యాంధ్రకు కట్టుబడతారా? | Sakshi
Sakshi News home page

కుప్పం ఎమ్మెల్యేగా బాబు సమైక్యాంధ్రకు కట్టుబడతారా?

Published Sat, Oct 12 2013 1:07 PM

కుప్పం ఎమ్మెల్యేగా బాబు సమైక్యాంధ్రకు కట్టుబడతారా? - Sakshi

హైదరాబాద్ : సీమాంధ్రలో  కాంగ్రెస్ పార్టీ  ప్రస్తుతం ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నేతలకు విభజన అంశం గురించి ముందుగానే తెలుసు అనే భావన ప్రజల్లో ఉందన్నారు.

కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు సమైక్యాంధ్రకు కట్టుబడతారో... రాష్ట్ర విభజనకు మద్దతు ఇస్తారో స్పష్టం చేయాలని అశోక్ బాబు శనివారమిక్కడ డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతు ఇచ్చే పార్టీలను త్వరలోనే కలుస్తామని ఆయన తెలిపారు.

Advertisement
Advertisement