6 నుంచి అసెంబ్లీ | Sakshi
Sakshi News home page

6 నుంచి అసెంబ్లీ

Published Sat, Mar 4 2017 2:46 AM

6 నుంచి అసెంబ్లీ - Sakshi

సోమవారం ఉ. 11.06 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగం
26వ తేదీతో నోటిఫికేషన్‌ జారీ చేసిన శాసనసభ సచివాలయం


సాక్షి, అమరావతి: వెలగపూడిలోని  తాత్కాలిక సచివాలయం ప్రాంగణంలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవనంలో శాసన సభ, మండలి సమావేశాలు సోమవారం (6వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 11.06 నిమిషాలకు గవర్నర్‌ నరసింహన్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు.  ఈ మేరకు అసెంబ్లీ సచివాలయం శుక్రవారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అయితే, గత నెల 26వ తేదీతో ఈ నోటిఫికేషన్‌ను జారీ చేయడం వివాదంగా మారింది. పాత తేదీతో  నోటిఫికేషన్‌ జారీ చేయడాన్ని అధికార యంత్రాంగం తప్పుపడుతోంది.

13న బడ్జెట్‌: సోమవారం గవర్నర్‌ ప్రసంగం అనంతరం అసెంబ్లీ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. వాయిదా పడిన తరువాత లేదా మంగళవారం శాసన సభా వ్యవహారాల కమిటీ సమావేశమవుతుంది. సమావేశాలు ఎప్పటివరకు నిర్వహించాలి, ఏ ఏ అంశాలను చర్చకు చేపట్టాలో ఈ సమావేశంలో నిర్ణయిస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2017–18) వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 13వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

Advertisement
Advertisement