సాలూరు:రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో మంత్రులు వ్యవహరించిన తీరు తనతో పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలందరినీ ఎంతగానో బా ధించిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిప్యూ టీ ఫ్లోర్లీడర్, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. వచ్చే సమావేశాల్లోనైనా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రజా సమస్యలపై చర్చించేలా చూడాలని కోరారు.
గురువారం ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడారు. తాను ఇప్పటివరకు మూడు సభల్లో పాల్గొన్నానని, కానీ ఎప్పుడూ ఇలాంటి సభను చూడలేదన్నారు. మంత్రులు మాట్లాడే తీరు చాలా బాధి కలిగించిందని చెప్పారు.ప్రజా సమస్యలపై ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పాల్సిన మంత్రులు అవమానకరంగా మాట్లాడడం, సమస్యలను లేవనెత్తుతున్న ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై లేనిపోని ఆరోపణలు చేస్తూ.. బ్లాక్ మెయిల్కు దిగడం విచారకరమన్నారు. అందుకే తమ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షా ...ప్రభుత్వంలో ఉన్నది మేమా, లేక టీడీపీ వాళ్లా అన్న అనుమానం కలుగుతోందని స్పీకర్ను ప్రశ్నించాల్సి వచ్చిందని గుర్తు చేశారు.
పతి పక్షం, ప్రభుత్వంపై సమస్యలపై దాడి చేయడం పరి పాటని, కానీ ప్రజా సమస్యలు అడిగిన ప్రతిపక్షంపై ప్రభుత్వం ఎదురుదాడికి దిగడం శోచనీయమన్నారు. ముఖ్యంగా రాష్ట్ర మంత్రులు తమ మాట తీరు మార్చుకోవాలని సూచించారు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా బ్లాక్ మెయి ల్కు దిగుతున్నారన్నారు. గృహ నిర్మాణ రుణాలు మంజూరు కాక, మం జూరైన వారికి బిల్లులు అందక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందు లు గురువుతున్నారని తాను సభ దృష్టికి తీసుకువెళితే జిల్లాకు చెందిన మంత్రి మృణాళిని సాలూరు నియోజకవర్గంలో కూడా అవినీతి జరిగిందని చెప్పుకొచ్చారన్నారు. అవినీతి జరిగిందని భావిస్తే విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలి కాని లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని తాను తిప్పికొట్టాల్సి వచ్చిందన్నారు.
ఇదే తీరు ప్రతి పక్ష సభ్యులందరిపైనా మం త్రులు కనపరిచారన్నారు. ఎంతసేపూ వైఎస్ జగన్మోహన్రెడ్డిని అవినీతిపరుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారే గాని ఆయనపై కేసులు విచార ణ దశలో ఉన్నాయన్న విషయం గుర్తుంచుకోకుండా వ్యాఖ్యానిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై కూ డా చాలా ఆరోపణలున్నాయని, వాటిపై సీబీఐతో విచారణ జరిపించుకుని మచ్చలేని నాయకుడిగా నిరూపించుకున్నప్పుడే జగన్ను విమర్శించే నైతిక హక్కు టీడీపీ నాయకులకు ఉంటుందని తెలిపారు.
ఏమీ లేకపోతే చంద్రబాబుపై విచారణకు హైకోర్టులో స్టే తెచ్చుకోవాల్సిన పని ఏమొచ్చిందని ప్రశ్నించారు. మొదటిసారిగా ఎన్నికైన గిరిజన ఎమ్మెల్యేలను శాసనసభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేశార న్నారు. తమది రైతు ప్రభుత్వమని చెబుతున్న టీడీపీ నాయకులు జిల్లాలోని ఎన్సీఎస్ చక్కెర కర్మాగార యాజమాన్యం దాదాపు 16 వేల మంది రైతులకు రూ. 28 కోట్ల చెల్లించకుండా రోడ్డెక్కేలా చేస్తే.. ఆ విషయమై చర్చిద్దామని సభలో అడిగితే కొట్టిపారేశారన్నారు. ఇదేనా రైతు ప్రభుత్వం వ్యవహరించే తీరని ప్రశ్నించారు. మంత్రులు నిబద్దతతో వ్యవహరించేలా ముఖ్యమంత్రి ప్రత్యేక శిక్షణ ఇస్తే బాగుం టుందని సూచించారు. ఈఏడాది చివరలో జరగనున్న శాసన సభలోనైనా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.
మంత్రుల తీరు బాధించింది!
Published Fri, Sep 12 2014 1:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement