* విశాఖ ఎయిర్పోర్టులో బంగారం స్మగ్లింగ్ గుట్టు రట్టు
సాక్షి, విశాఖపట్నం/గోపాలపట్నం: భారీ స్థాయిలో బంగారం స్మగ్లింగ్కు పాల్పడుతున్న ముఠాలను విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో డెరైక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. విశాఖ విమానాశ్రయం చరిత్రలోనే కనీవినీ ఎరుగని భారీ స్మగ్లింగ్ గుట్టు రట్టు చేశారు. ఇప్పటివరకు ఏకంగా 63 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఆదివారం రాత్రి ప్రారంభమైన తనిఖీలు సోమవారం రాత్రి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో మరింత బంగారం పట్టుబడే అవకాశం ఉందని తెలుస్తోంది. సోమవారం సాయంత్రం ఎయిర్పోర్టులో కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ జి.రాజేంద్రన్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. చెన్నైకి చెందిన కొందరు ముఠాలుగా ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాల లోపలి భాగాల్లో ఉంచడం ద్వారా సింగపూర్, మలేసియా దేశాల నుంచి హైదరాబాద్, విశాఖలకు భారీ స్థాయిలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు డీఆర్ఐ చెన్నై జోనల్ యూనిట్కు సమాచారం అందింది.
వెంటనే అధికారులు హైదరాబాద్, విశాఖలకు ప్రత్యేక బృందాలతో చేరుకున్నారు. ఆదివారం రాత్రి 9.10 సమయంలో కౌలాలంపూర్ నుంచి విశాఖ వచ్చిన ఎయిర్ ఏషియా 83, మిలిందో 251(రాత్రి 10.05గంటలు) విమానాలతో పాటు సింగపూర్ నుంచి వచ్చిన సిల్క్ ఎయిర్ ఎంఐ442 (రాత్రి 11గంటలు) విమానంలో స్మగ్లింగ్ బంగారం ఉన్నట్లు గుర్తించారు. మూడు విమానాల్లోని ప్రయాణికులను, వారి బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చే శారు.
56 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. మ్యూజిక్ సిస్టమ్లు, యాంప్లిఫయర్లు, మినీ వాషింగ్ మిషన్లు, ఎలక్ట్రిక్ ఓవెన్, ఇండక్షన్ స్టవ్, టీవీ, ఇతర పరికరాల్లో బంగారం దాచి తీసుకువస్తున్నట్లు తేల్చారు. మొత్తం రూ.16.85 కోట్ల విలువైన 63 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రాజేంద్రన్ తెలిపారు. నిందితుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఎయిర్పోర్టు డెరైక్టర్ శర్మ కస్టమ్స్ అధికారులకు సహకరించారు.
తనిఖీలు పూర్తి చేసుకున్న ప్రయాణికుల్లో తమిళనాడుకు చెందిన పలువురు ఉన్నారు. మరోవైపు నిందితుల తరఫున కొందరు తమిళనాడు నుంచి విశాఖ చేరుకున్నారు. దీంతో విమానాశ్రయ ప్రాంగణం ఉద్రిక్తంగా మారింది. ముందుజాగ్రత్త చర్యగా పోలీసు బలగాలను భారీగా మోహరించారు.
63 కేజీల పసిడి పట్టివేత
Published Tue, Jun 23 2015 3:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement