ఏటీఎం చోరీకి విఫలయత్నం | Sakshi
Sakshi News home page

ఏటీఎం చోరీకి విఫలయత్నం

Published Tue, Mar 17 2015 11:31 AM

atm theft in krishna distirict

విజయవాడ : గుర్తుతెలియని దుండగులు ఎటీఎంలో చోరీకి విఫలయత్నం చేశారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం కష్ణా జిల్లా మండవెల్లి మండలం లింగాల గ్రామంలో ఉన్న ఎటీఎంలో జరిగింది. వివరాలు.. గ్రామంలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ఏటీఎం గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేశారు. ఎంతకీ ఏటీఎం తెరుచుకోక పోవడంతో దుండగులు పరారయ్యారు. స్తానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సీసీటీవీ పుటేజ్‌లను పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
(మండవెల్లి)

Advertisement
Advertisement