వృద్ధ దంపతులపై దాడి | Sakshi
Sakshi News home page

వృద్ధ దంపతులపై దాడి

Published Thu, Apr 30 2015 4:41 PM

attack on elderly couple

పాలకొల్లు : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో గురువారం వృద్ధ దంపతులపై దాడి జరిగింది. పాలకొల్లుకు చెందిన వెంకటేశ్వరరావు, సూర్యకుమారి అనే వృద్ధదంపతులను దొంగలు ఇంట్లో బంధించి, దాడి చేసి వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. 

 

ప్రస్తుతం దంపతులిద్దరూ పాలకొల్లు ప్రభుత్వాసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. అయితే జరిగిన ఘటనపై దంపతులిద్దరూ పొంతనలేని సమాధానాలు చెబుతున్నారు. దీని గురించి ప్రభుత్వాసుపత్రి వైద్యులు పోలీసులకు సమాచారమిచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement