హైదరాబాద్: చంద్రబాబు నాయుడు ఏడాది పాలనలో దళితులపై దాడులు విపరీతంగా పెరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున ఆవేధన వ్యక్తం చేశారు. చంద్రబాబు దళితులకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. దళితులు జగన్ వెంట నడుస్తున్నారన్న కారణంతోనే వారిని ఊచకోత కోస్తున్నారన్నారు.
దళితులపై జరుగుతున్న దాడులు, దళిత సంక్షేమానికి పెట్టిన ఖర్చు, దళిత ఉద్యోగులపై కొనసాగుతున్న వివక్షపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. కర్నూలు, అనంతపురం, గుంటూరు జిల్లాల్లో టీడీపీ నేతల దాడుల్లో గాయపడ్డ దళితులను ఏవిధంగా ఆదుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.