Sakshi News home page

ఘర్షణ నివారించబోతే హత్య చేశారు!

Published Mon, Sep 22 2014 9:57 AM

Auto driver murder in Ramabhadrapuram

విశాఖపట్నం: పుణ్యానికిపోతే పాపం ఎదురైనట్లు, మంచికి పోతే చెడు ఎదురైనట్లు రెండు వర్గాల మధ్య ఘర్షణను నివారించబోయి ఓ ఆటో డ్రైవర్ తన ప్రాణాలు కోల్పోయాడు. ఆ కిరాతకులు సర్ధిచెప్పడానికి వచ్చిన వ్యక్తినే హత్య చేశారు.  పాయకరావుపేట మండలం రామభద్రపురంలో ఈ దారుణం జరిగింది.

స్థానికుల కథనం ప్రకారం రామభద్రపురంలో రెండు వర్గాలకు చెందిన వారు ఘర్షణపడుతున్నారు. ఆ ఘర్షణ నివారించేందుకు ఆటోడ్రైవర్ సత్తిబాబు ప్రయత్నించాడు. వారికి సర్ధిచెప్పబోయాడు. వారు అతనిని కత్తులతో పొడిచి హత్య చేశారు.
**

Advertisement
Advertisement