గార : మొగదాలపాడు బీచ్లో ఆదివారం విహారయాత్ర కు వెళ్లి గల్లంతైన నలుగురి ఆచూకీ లభ్యమైంది. సోమవారం ఉదయానికి మూడు మృతదేహాలు లభ్యం కాగా సాయంత్రం మొగదాలపాడు గ్రామానికి చెందిన కోరాడ మూర్తి మృతదేహం లభ్యమైంది. శ్రీకాకుళంకు చెందిన తుమ్ము ఉపేంద్ర, జొన్నలపాడు గ్రామానికి చెందిన పందిరి సోమశేఖర్, ఆమదాలపాడు గ్రామానికి చెందిన తామాడ సింహాచలం మృతదేహాలు సమద్రం ఒడ్డున తేలాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించారు. వీరితో పాటు గల్లంతైన మొగదాలపాడు గ్రామానికి చెందిన కోరాడ మూర్తి మృతదేహాన్ని మంగళవారం రిమ్స్కు తరలించనున్నా రు. ఆదివారం కేవలం ముగ్గురు యువకులు మాత్రమే గల్లంతైనట్టు గుర్తించారు. అయితే మరో వ్యక్తి శవమై తేలడంతో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. గార ఎస్సై పిమురళి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎమ్యెల్యే పరామర్శ
శ్రీకాకుళం ఎమ్యెల్యే గుండ లక్ష్మీదేవి మొగదాలపాడు బీచ్ వద్దకు వెళ్లి మృతదేహాలను పరిశీలించారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాడ సానుభూతి తెలిపారు. బీచ్ వద్ద పటిష్ట రక్షణ చర్యలు చేపడతామన్నారు.
తల్లిని ఒంటరిని చేసి వెళ్లిపోయాడు
శ్రీకాకుళం క్రైం : స్నేహితులతో కలసి పిక్నిక్కు వెళ్లిన పట్టణంలోని చిన్నబరాటం వీధికి చెందిన తుమ్ము ఉపేంద్ర సముద్రంలో గల్లంతై మృతిచెందడంతో విషాదం అలుముకుంది. వివరాల్లోకి వెళ్తే... ఉపేంద్ర తన స్నేహితులతో కలసి ఆదివారం సాయంత్రం పిక్నిక్కు వెళ్లి మొగదలపాడు బీచ్లో గల్లంతైన విషయం తెలిసిందే. అయితే సముద్రంలోపలకు వెళ్లిపోయిన ఉపేంద్ర సోమవారం తెల్లవారి శవమై సముద్ర ఒడ్డున తేలాడు. విషయం తెలుసుకున్న బంధువులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. మృతదేహానికి రిమ్స్లో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. కుటుంబ బాధ్యతను మొత్తం చిన్న వయసులోనే మీదన వేసుకున్న ఉపేంద్ర చనిపోవడంతో తల్లి సూరికుమారి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. సుమారు ఏడాదిన్నర కిందట ఉపేంద్ర తన చెల్లెలు ఆశకు ఘనంగా వివాహం చేశాడు. తన తల్లి సూరికుమారిని బాగా చూసుకుందామనుకున్న సమయంలో ఒంటరిని చేసి అనంతలోకాలకు వెళ్లిపోయాడని బంధువులు కంటతడి పెడు
తున్నారు.
నాలుగు మృతదేహాలు లభ్యం
Published Tue, Nov 18 2014 1:50 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement